యాప్నగరం

గాయంతో వన్డే సిరీస్‌కి పంత్ దూరం..?

క్యాచ్ కోసం బౌండరీ లైన్‌‌పైకి వెళ్లిపోయిన రిషబ్ పంత్.. క్యాచ్‌ని అందుకుని అనంతరం నియంత్రణ కోల్పోయి అక్కడే ఉన్న హోర్డింగ్స్‌ని బలంగా ఢీకొన్నాడు.

Samayam Telugu 25 Oct 2018, 3:32 pm
Samayam Telugu 1540406607-Rishabh_Pant_injury
వెస్టిండీస్‌తో విశాఖపట్నం వేదికగా బుధవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో గాయపడిన భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. సిరీస్ మొత్తానికి దూరంకాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ 36వ ఓవర్ వేసిన స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌లో పొవెల్ బంతిని బౌలర్ తలమీదుగా గాల్లోకి లేపేశాడు.

ఎక్కువ ఎత్తులో బంతి గాల్లోకి లేవడంతో లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రిషబ్ పంత్ క్యాచ్ కోసం ప్రయత్నించాడు. అయితే.. ఈ క్రమంలో బౌండరీ లైన్‌‌పైకి వెళ్లిపోయిన రిషబ్ పంత్.. క్యాచ్‌ని అందుకుని అనంతరం నియంత్రణ కోల్పోయి అక్కడే ఉన్న హోర్డింగ్స్‌ని బలంగా ఢీకొన్నాడు. దీంతో.. అతని చేతి వేళ్లతో పాటు భుజానికి గాయమైంది. ఈ ఘటన తర్వాత ఫిజియోతో పాటు మైదానం వీడిన రిషబ్ పంత్ మళ్లీ ఫీల్డింగ్‌కి రాలేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. సిరీస్‌లో మిగిలిన మూడు వన్డేలకీ అతను దూరంగా ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మ్యాచ్‌లో విరాట్ కోహ్లి (157 నాటౌట్: 129 బంతుల్లో 13x4, 4x6) అజేయ శతకం బాదడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో షై హోప్ సెంచరీ సాధించడంతో.. వెస్టిండీస్ కూడా సరిగ్గా 50 ఓవర్లలో 321/7తో నిలవడంతో మ్యాచ్ టైగా ముగిసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.