యాప్నగరం

ICC Test Team 2022: కెప్టెన్‌గా బెన్ స్టోక్స్.. భారత్‌ నుంచి ఒక్కరికే చోటు!

ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సారథ్యంలో.. టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ 2022ను ఐసీసీ ప్రకటించింది. పదకొండు మంది ఆటగాళ్ల జాబితాలో అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి నలుగురు ఆటగాళ్లకు చోటు దక్కగా.. ఇంగ్లాండ్ నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. పాకిస్థాన్ నుంచి బాబర్ ఆజమ్, భారత్ నుంచి రిషబ్ పంత్‌లకు అవకాశం లభించింది.

Authored byరవి కుమార్ | Samayam Telugu 24 Jan 2023, 7:06 pm

ప్రధానాంశాలు:

  • 2022కిగానూ టెస్టు జట్టును ప్రకటించిన ఐసీసీ
  • భారత్‌ నుంచి పంత్‌కి మాత్రమే చోటు
  • ఆసీస్ నుంచి అత్యధికంగా నలుగురికి చోటు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rishabh Pant
Rishabh Pant
2022కి గానూ 11 మంది ఆటగాళ్లతో ఐసీసీ పురుషుల టెస్టు జట్టును ప్రకటించింది. గత ఏడాది లాంగ్ ఫార్మాట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఈ జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సారథ్యంలో ప్రకటించిన ఈ జట్టులో భారత్ నుంచి రిషబ్ పంత్‌కు మాత్రమే చోటు దక్కింది. ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా నలుగురు ఆటగాళ్లకు చోటు దక్కగా.. ఇంగ్లాండ్ నుంచి ముగ్గురిని ఐసీసీ ఎంపిక చేసింది. వెస్టిండీస్, పాకిస్థాన్, సౌతాఫ్రికా నుంచి ఒక్కొక్కరికి అవకాశం లభించింది.
ఓపెనర్లుగా ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా, వెస్టిండీస్ బ్యాటర్ కార్లోస్ బ్రాత్‌వైట్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. ఖవాజా 2022లో 67.50 యావరేజ్‌తో 1080 పరుగులు చేశాడు. కరేబియన్ ఆటగాడైన బ్రాత్‌వైట్ 2022లో 14 ఇన్నింగ్స్‌ల్లో 687 పరుగులు చేశాడు.

మూడో స్థానానికి ఆసీస్ ఆటగాడు మార్నస్ లబుచానేను ఎంపిక చేసిన ఐసీసీ.. నాలుగో స్థానానికి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను ఎంపిక చేసింది. లబుచానే గత ఏడాది టెస్టుల్లో 957 పరుగులు చేయగా.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ 9 మ్యాచ్‌ల్లో దాదాపు 70 యావరేజ్‌తో 1184 పరుగులు చేశాడు.

ఐదు, ఆరు స్థానాలకు గానూ ఇంగ్లిష్ ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్‌లను ఐసీసీ ఎంపిక చేసింది. గత వేసవిలో బెయిర్ స్టో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన బెయిర్ స్టో ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక బెన్ స్టోక్స్ విషయానికి వస్తే కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌కు తిరుగులేని విజయాలు అందించాడు. 2022లో 870 పరుగులు చేయడమే గాకుండా 26 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికాపై పది వికెట్లు తీసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఐసీసీ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రికెటర్ రిషబ్ పంత్. 2022లో పంత్ 12 ఇన్నింగ్స్‌ల్లో 61.81 యావరేజ్, 90కిపైగా స్ట్రయిక్ రేట్‌తో 680 పరుగులు చేశాడు. గత ఏడాది పంత్ రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 2022లో టెస్టుల్లో 21 సిక్సులు బాదిన పంత్.. వికెట్ కీపర్‌గా ఆరు స్టంపౌట్లు చేయడంతోపాటు.. 23 క్యాచ్‌లు అందుకున్నాడు.

ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ, ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్, ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను ఐసీసీని 2022 టెస్టు జట్టులోకి ఎంపిక చేసింది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.