యాప్నగరం

ప్రపంచకప్‌లో ధోనీనే ఆడించండి..!: సెహ్వాగ్

ఒకవేళ ఇప్పటి నుంచి రిషబ్ పంత్‌ని వన్డేల్లో ఆడించినా.. 2019 ప్రపంచకప్‌లో మాత్రం మహేంద్రసింగ్ ధోనీనే ఆడించాలి.

Samayam Telugu 12 Sep 2018, 10:47 pm
ఇంగ్లాండ్‌ గడ్డపై 2019లో జరగనున్న ప్రపంచకప్‌లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని ఆడించాలని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సూచించాడు. ఇంగ్లాండ్‌తో మంగళవారం ముగిసిన చివరి టెస్టులో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (114: 146 బంతుల్లో 15x4, 4x6) మెరుపు శతకం బాదడంతో.. అతడ్ని ప్రపంచకప్‌లో ఆడించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ పిచ్‌లపై.. అదీ ఫాస్ట్ బౌలర్లని సమర్థంగా ఎదుర్కొని పంత్ సిక్సర్లు బాదడంతో ఈ డిమాండ్లకి బలం చేకూరింది.
Samayam Telugu 1536765279-Dhoni_Pant


ధోనీ స్థానంలో పంత్‌కి ప్రపంచకప్‌లో ఛాన్సివ్వాలనే డిమాండ్‌పై తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ ‘ఒకవేళ ఇప్పటి నుంచి రిషబ్ పంత్‌ని వన్డేల్లో ఆడించినా.. 2019 ప్రపంచకప్‌లో మాత్రం మహేంద్రసింగ్ ధోనీనే ఆడించాలి. ఎందుకంటే.. పంత్‌కి అనుభవం తక్కువ. దీనికితోడు వరల్డ్‌కప్‌‌లోపు అతను 15-16 వన్డేలు ఆడే అవకాశం లేదు. మరోవైపు ధోనీ ఇప్పటికే 300+ వన్డేలాడేశాడు. కాబట్టి వీరిమధ్య పోలిక కూడా సమంజసం కాదు. వ్యక్తిగతంగా ధోనీ ప్రపంచకప్ ఆడాలని నేను కోరుకుంటున్నా’ అని వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.