ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ముంగిట టీమిండియాలో కొత్త తలనొప్పి మొదలైంది. అడిలైడ్ వేదికగా రానున్న గురువారం నుంచి ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియా తలపడనుండగా.. తుది జట్టు ఎంపికపై సందిగ్ధత నెలకొంది. మరీ ముఖ్యంగా.. వికెట్ కీపర్గా ఎవరిని ఎంపిక చేయాలి..? అనే దానిపై టీమిండియా మేనేజ్మెంట్ ముల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మిడిలార్డర్ బ్యాట్స్మెన్ హనుమ విహారి తాజాగా స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియా-ఎ జట్టుతో ఇటీవల జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్లో సీనియర్ వికెట్ కీపర్ సాహా 54 పరుగులతో రెండో ఇన్నింగ్స్లో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత రెండో ప్రాక్టీస్ మ్యాచ్లో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 103 పరుగులతో రెండో ఇన్నింగ్స్లో అజేయంగా నిలిచాడు. దాంతో.. బ్యాటింగ్ పరంగా ఇద్దరూ మంచి టచ్లో కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా.. రిషబ్ పంత్
73 బంతుల్లోనే 9x4, 6x6 బాదడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో.. సాహాకి ఛాన్స్ ఇస్తే..? విమర్శలు వస్తాయేమో అని టీమిండియా మేనేజ్మెంట్ కంగారుపడుతోంది. బ్యాటింగ్లో సాహా కాస్త వెనకబడి ఉన్నట్లు కనిపిస్తున్నా.. కీపింగ్లో మాత్రం పంత్ కంటే ముందు వరుసలోనే అతను ఉన్నాడు.
సాహా, పంత్ మధ్య వికెట్ కీపింగ్ స్థానం కోసం పోటీ ఏర్పడటంపై హనుమ విహారి మాట్లాడుతూ ‘‘ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ టీమ్కి మేలే చేస్తుంది. టీమిండియాలో ఇప్పుడు ప్రతి స్థానానికి గట్టి పోటీ ఉంది. అయితే.. తుది జట్టు ఎంపిక నిర్ణయం మాత్రం పూర్తిగా టీమిండియా మేనేజ్మెంట్దే. సాహా, రిషబ్ పంత్.. ఇద్దరూ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి.. ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయడమంటే కష్టమే. అయితే.. ఇది మేనేజ్మెంట్కి మంచి తలనొప్పే’’అని వెల్లడించాడు.
ఆస్ట్రేలియా-ఎ జట్టుతో ఇటీవల జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్లో సీనియర్ వికెట్ కీపర్ సాహా 54 పరుగులతో రెండో ఇన్నింగ్స్లో అజేయంగా నిలిచాడు. ఆ తర్వాత రెండో ప్రాక్టీస్ మ్యాచ్లో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 103 పరుగులతో రెండో ఇన్నింగ్స్లో అజేయంగా నిలిచాడు. దాంతో.. బ్యాటింగ్ పరంగా ఇద్దరూ మంచి టచ్లో కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా.. రిషబ్ పంత్
73 బంతుల్లోనే 9x4, 6x6 బాదడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో.. సాహాకి ఛాన్స్ ఇస్తే..? విమర్శలు వస్తాయేమో అని టీమిండియా మేనేజ్మెంట్ కంగారుపడుతోంది. బ్యాటింగ్లో సాహా కాస్త వెనకబడి ఉన్నట్లు కనిపిస్తున్నా.. కీపింగ్లో మాత్రం పంత్ కంటే ముందు వరుసలోనే అతను ఉన్నాడు.
సాహా, పంత్ మధ్య వికెట్ కీపింగ్ స్థానం కోసం పోటీ ఏర్పడటంపై హనుమ విహారి మాట్లాడుతూ ‘‘ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ టీమ్కి మేలే చేస్తుంది. టీమిండియాలో ఇప్పుడు ప్రతి స్థానానికి గట్టి పోటీ ఉంది. అయితే.. తుది జట్టు ఎంపిక నిర్ణయం మాత్రం పూర్తిగా టీమిండియా మేనేజ్మెంట్దే. సాహా, రిషబ్ పంత్.. ఇద్దరూ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నారు. కాబట్టి.. ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయడమంటే కష్టమే. అయితే.. ఇది మేనేజ్మెంట్కి మంచి తలనొప్పే’’అని వెల్లడించాడు.