యాప్నగరం

పంత్ అభిమానులకు గుడ్ న్యూస్.. వేగంగా కోలుకుంటున్న క్రికెటర్

రిషబ్ పంత్ అభిమానులకు గుడ్ న్యూస్. డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో అతడికి సర్జరీ నిర్వహించారు. సర్జరీ అనంతరం పంత్ తొలిసారిగా తన కాళ్లపై తాను నిలబడగలిగాడు. పంత్ మరో వారం రోజులపాటు హాస్పిటల్‌లో ఉండాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. రిషబ్ పంత్ తిరిగి క్రికెట్ ఆడటానికి కనీసం 4 నెలల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 13 Jan 2023, 4:37 pm

ప్రధానాంశాలు:

  • వేగంగా కోలుకుంటున్న రిషబ్ పంత్
  • సర్జరీ అనంతరం తన కాళ్లపై నిలబడిన రిషబ్
  • మరో వారం రోజుల తర్వాతే క్రికెటర్ డిశ్చార్జ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rishabh Pant
Rishabh Pant
భారత క్రికెట్ అభిమానులు గుడ్ న్యూస్. ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. మోకాలి సర్జరీ చేయించుకున్న పంత్.. ఆపరేషన్ తర్వాత తొలిసారి తన కాళ్లపై లేచి నిల్చున్నాడు. కొద్ది సెకన్లపాటు పంత్ తన కాళ్ల మీద నిలబడగలిగాడు. రిషబ్ పంత్ పూర్తిగా కోలుకోవడానికి 4 నుంచి 6 నెలల సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
పంత్ తిరిగి క్రికెట్లో అడుగుపెట్టడానికి అభిమానులు మరో 6 నెలలకు పైగా నిరీక్షించాల్సి ఉంటుంది. పంత్ ఐపీఎల్‌ 2023 సీజన్‌కు దూరవుతున్నాడని సౌరభ్ గంగూలీ ఇదివరకే ప్రకటించారు.

వికెట్ కీపర్ బ్యాటర్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జయ్యాక.. రీహాబిలిటేషన్‌‌‌లో ఎంత త్వరగా కోలుకుంటాడనేదాన్ని బట్టి అతడి పునరాగమనం ఆధారపడి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. పంత్ కనీసం మరో వారంపాటు హాస్పిటల్‌లోనే ఉండాల్సి ఉంటుందని భావిస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో వాకర్, సపోర్టు సాయంతో పంత్ నడిచే వీలుంది.

డిసెంబర్ 30న తెల్లవారుజామున డెహ్రాడూన్-ఢిల్లీ హైవేపై రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో.. మంటలు అంటుకోవడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. పంత్ కాలిన గాయాలతో బయటపడ్డాడు. ఈ క్రమంలో అతడి కాలి లిగ్మెంట్, కాలి మడమకు గట్టిగా దెబ్బలు తగిలాయి.

ప్రమాదంలో గాయపడిన పంత్‌ను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందించారు. జనవరి 4 మధ్యాహ్నం వరకు పంత్ అక్కడే చికిత్స పొందాడు. లిగ్మెంట్ సర్జరీ కోసం బీసీసీఐ అతణ్ని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్‌‌కు తరలించింది. రిషబ్ హాస్పిటల్ ఖర్చులన్నీ తామే భరిస్తామని బోర్డు ఇది వరకే ప్రకటించింది. అంతే కాకుండా ఐపీఎల్ శాలరీ రూ.16 కోట్లు, వార్షిక వేతనం రూ.5 కోట్లు అందిస్తామని బీసీసీఐ తెలిపింది.

Read More Sports News And Telugu News
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.