యాప్నగరం

Rishabh Pant: గెలుపు సంబరాల్లో.. పలకరించినా పంత్‌ను పట్టించుకోని తోటి క్రికెటర్లు..? ఓ మూలన నిలబడి..!

Rishabh Pant: ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన తర్వాత టీమిండియా క్రికెటర్లు సంబరాలు చేసుకున్నారు. కానీ ఆ సమయంలో పంత్‌ను తోటి క్రికెటర్లను పలకరించబోగా వారు పట్టించుకోలేదని అతడి ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఆటగాళ్లంతా ట్రోఫీతో ఫొటోకు ఫోజిచ్చిన సమయంలోనూ కార్తీక్ చేతిలో ట్రోఫీతో కనిపించగా.. పంత్ మాత్రం ఓ చివరన నిలబడి ఉన్నాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటి చేత్తో జట్టును గెలిపించిన పంత్‌ను ఇలా అవమానిస్తారా అంటూ మిగతా క్రికెటర్లపై అతడి ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 27 Sep 2022, 5:14 pm

ప్రధానాంశాలు:

  • ఆసీస్‌పై విజయం తర్వాత టీమిండియా సంబరాలు
  • పంత్ పలకరించబోయినా పట్టించుకోని మిగతా క్రికెటర్లు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Team India
Team India
రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్.. వీరిద్దరిలో టీ20 వరల్డ్ కప్ ఆడేది ఎవరు..? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. కానీ స్లాగ్ ఓవర్లలో హిట్టింగ్ చేయగలగడంతో ఫినిషర్‌గా వాడుకునే వెసులుబాటు ఉండటం, వయసు రీత్యా ఇదే చివరి వరల్డ్ కప్ అయ్యే అవకాశం ఉండటంతో.. కార్తీక్‌ వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా కప్‌లో జడేజా గాయపడటంతో లెఫ్ట్ హ్యాండర్ అయిన పంత్‌కు తుది జట్టులో చోటు దక్కింది. కానీ ఆ అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో కార్తీక్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనేది టీమిండియా మేనేజ్‌మెంట్ వ్యూహంలా ఉంది.
మరోవైపు పంత్ విషయానికి వస్తే.. టెస్టులు, వన్డేల్లో అదరగొడుతున్నప్పటికీ.. టీ20ల్లో మాత్రం అంతగా రాణించలేకపోతున్నాడు. దీంతో తుది జట్టులో చోటు కోసం నిరీక్షించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. కానీ పొట్టి ఫార్మాట్లోనూ రాణించగల సత్తా పంత్‌కు ఉంది.

కాగా ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలుపొందాక... మిగతా భారత క్రికెటర్లు పంత్‌ను పట్టించుకోలేదని, అతడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎప్పడూ జోకులేస్తూ.. సహచరులతో సరదాగా గడిపే పంత్.. సిరీస్ గెలిచాక... ముభావంగా ఉండటాన్ని ప్రస్తావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి ఓ వీడియోను పోస్టు చేశారు.
కోహ్లి, పాండ్య లాంటి ఆటగాళ్లతో పంత్ మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ.. వారు అతణ్ని పట్టించుకోలేదని రిషబ్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. జట్టంతా ట్రోఫీతో ఫొటోకు ఫోజు ఇచ్చినప్పుడు.. దినేశ్ కార్తీక్ ట్రోఫీని చేతులతో ఎత్తి పట్టుకోగా.. పంత్ మాత్రం ఎడమ వైపు చివరన నిలబడ్డాడు.

టెస్టులు, వన్డేల్లో అనేక సందర్భాల్లో భారత్‌కు ఒంటి చేత్తో విజయాలు అందించిన రిషబ్‌ను ఇలా అవమానిస్తారా..? అంటూ పంత్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విరాట్ కోహ్లి చేసిన ‘చుట్టూ ఎంత మంది ఉన్నా.. ఒక్కడిననే భానవతో ఉన్నాను’ అనే ట్వీట్‌ను పంత్ అభిమాని ఒకరు ట్వీట్ చేశారు. పంత్ కంటే దినేశ్ కార్తీక్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వొద్దని మరో అభిమాని సూచించారు.

పంత్ మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగుతుండగా.. దినేశ్ కార్తీక్‌ను మేనేజ్‌మెంట్ అవసరాన్ని బట్టి అనేక పొజిషన్లలో బ్యాటింగ్‌కు దింపుతోంది. కార్తీక్‌ను ఫినిషర్‌గా వాడుకునేందుకు మేనేజ్‌మెంట్ ఆసక్తి చూపుతోంది. లోయర్ ఆర్డర్‌లో కార్తీక్ కూడా సత్తా చాటుతుండటంతో.. టీ20ల్లో పంత్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఇబ్బందిగా మారింది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.