యాప్నగరం

కీపర్‌గా రిషబ్ పంత్ ఎంపికే పెద్ద తప్పు..!

వికెట్ల వెనుక డైవ్ క్యాచ్‌లు పట్టి తన ప్రత్యేకత చాటిన పంత్.. మూడు టెస్టుల్లో ఏకంగా 76 పరుగులను బైస్‌ రూపంలో ఇచ్చి విమర్శలు మూటగట్టుకున్నాడు.

Samayam Telugu 11 Sep 2018, 7:44 pm
ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ కోసం వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్‌ని సెలక్టర్లు ఎంపిక చేయడం పెద్ద తప్పిదమని భారత మాజీ వికెట్ కీపర్ నయాన్ మోంగియా అభిప్రాయపడ్డాడు. తొలి రెండు టెస్టుల్లో బ్యాట్‌తో విఫలమైన రెగ్యులర్ వికెట్ కీపర్‌ దినేశ్ కార్తీక్‌ని మూడో టెస్టులో తప్పించిన టీమిండియా మేనేజ్‌మెంట్ రిషబ్ పంత్‌కి వరుసగా 3, 4, 5 టెస్టుల్లో అవకాశాలు ఇచ్చింది. అయితే వికెట్ల వెనుక డైవ్ క్యాచ్‌లు పట్టి తన ప్రత్యేకత చాటిన పంత్.. మూడు టెస్టుల్లో ఏకంగా 76 పరుగులను బైస్‌ రూపంలో ఇచ్చి విమర్శలు మూటగట్టుకున్నాడు. వికెట్ కీపర్‌గా అతని బేసిక్సే సరిగా లేవని మోంగియా పెదవి విరిచాడు.
Samayam Telugu Nottingham: Indias wicketkeeper Rishabh Pant, center, stands with captain Virat...


‘వికెట్ కీపింగ్‌లో రిషబ్ పంత్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాడు. అయినా.. ఐపీఎల్‌ ప్రదర్శన ఆధారంగా టెస్టుల్లోకి అతడ్ని కీపర్‌గా ఎంపిక చేసిన సెలక్షన్ పాలసీది తప్పు. అతని బేసిక్స్‌ కూడా సరిగా లేవు. ఇంగ్లాండ్ గడ్డపై స్పిన్నర్ల బౌలింగ్‌లో అతను వికెట్ల వెనుక బంతిని సరిగా అందుకోలేకపోతున్నాడు. ఉపఖండం పిచ్‌లపైనా టెస్టు మ్యాచ్ నాలుగు లేదా ఐదో రోజు అతను ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులను కలుపుకుని భారత్ జట్టు త్వరలోనే ఆరు టెస్టు మ్యాచ్‌లను ఆడబోతోంది. ఈ టెస్టులకి సీనియర్ వికెట్ కీపర్లు పార్థీవ్ పటేల్ లేదా దినేశ్ కార్తీక్‌కి మళ్లీ ఛాన్సిస్తారని నేను అనుకోవడం లేదు. అలా అని ఒక సిరీస్ తర్వాత యువ వికెట్‌ కీపర్‌ని పక్కన పెట్టాలని కూడా నేను కోరుకోవట్లేదు. అయితే.. పంత్ ఇంకా కీపింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాల్సి ఉంది అంతే..!’ అని నయాన్ మోంగియా స్పష్టం చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.