యాప్నగరం

ఆసీస్ క్రికెటర్ల బస్సుపై రాయితో దాడి

రెండో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం హోటల్‌కి తిరిగి వెళ్తున్న ఆసీస్ క్రికెటర్లకు అనుకోని షాక్ తగిలింది.

TNN 11 Oct 2017, 11:40 am
గువహటి: ఆసీస్ క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి రాయితో దాడి చేశారు. రెండో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం బరస్పరా స్టేడియం నుంచి హోటల్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. క్రికెట్ బాల్ పరిమాణంలో ఉన్న రాయి బలంగా తగలడంతో బస్సు కుడి వైపు ఉన్న కిటికీ అద్దం పగిలిపోయింది. అదృష్టవశాత్తూ ఆ సీట్లో ఎవరూ కూర్చోకపోవడంతో.. ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదు.
Samayam Telugu rock thrown at australian team bus
ఆసీస్ క్రికెటర్ల బస్సుపై రాయితో దాడి


ఈ ఘటనతో ఆసీస్ క్రికెటర్లు భయాందోళనకు గురయ్యారు. జట్టు సభ్యులు బస్సులో హోటల్‌కు వెళ్తున్నప్పుడు బస్సు కిటికీ అద్దంపై ఎవరో రాయి విసిరారు. ఈ ఘటన ఎంతో భయాన్ని కలిగించిందని ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ ట్వీట్ చేశాడు.

Pretty scary having a rock thrown through the team bus window on the way back to the hotel!! pic.twitter.com/LBBrksaDXI — Aaron Finch (@AaronFinch5) October 10, 2017
ఆసీస్ క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి జరగడం గత ఐదువారాల్లో ఇది రెండోసారి. గత నెల ఆరంభంలో చిట్టగాంగ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై బంగ్లాదేశ్ అభిమానులు రాళ్లతో దాడి చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.