యాప్నగరం

రోహిత్‌ను అక్కడికి ఎవరు వెళ్లమన్నారో తెలీదు.. అదంతా తప్పుడు ప్రచారం: బీసీసీఐ

Ishant Sharma, రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జట్టుతో కలిసే విషయమై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. వారిద్దరూ టెస్టు జట్టులో భాగం కాదని స్పష్టం చేసింది.

Samayam Telugu 25 Nov 2020, 10:36 am
రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ వివాదం విషయమై బీసీసీఐ స్పందించింది. వీరిద్దరూ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం లేదని.. భారత జట్టుతో చేరడం లేదని స్పష్టం చేసింది. కోహ్లి స్వదేశానికి తిరిగొస్తున్నందున.. శ్రేయస్ అయ్యర్ టెస్టు సిరీస్ ముగిసే వరకు జట్టుతోనే ఉంటాడని ఆశిస్తున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడేందుకు రోహిత్‌ ఫిట్‌గా ఉంటాడా లేదా అనేది డిసెంబర్ 11న పరీక్షించనున్నారు.
Samayam Telugu ​Rohit Sharma


‘‘ఒకవేళ రోహిత్ ఫిట్ అని తేలితే.. మరుసటి రోజు ఆస్ట్రేలియా బయల్దేరి వెళ్లాలనుకున్నా.. విమాన సర్వీసులు కూడా లేవు కదా. ఎలాగోలా వెళ్లినా ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం రెండు వారాలు క్వారంటైన్లో ఉండాలి’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

రోహిత్ టెస్టులు ఆడాలని భావిస్తే.. తను ఫిట్‌గా ఉన్నాడని భావించి ఉంటే.. నవంబర్ 12నే మిగతా జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లేవాడు. కానీ అతడు నేషనల్ క్రికెట్ అకాడమీకి వచ్చాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం రోహిత్ ఫిట్‌నెస్‌ను పరీక్షిస్తున్నారు.

‘‘రోహిత్‌ను ఎన్‌సీఏకి వెళ్లమని ఎవరు చెప్పారో బీసీసీఐలో ఎవరికీ తెలీదు. అది అతడి సొంత నిర్ణయమా? రోహిత్ ఫిట్‌నెస్ తేల్చే బాధ్యత ఇప్పుడు ఎన్‌సీఏది’’ అని బీసీసీఐ తెలిపింది.

రోహిత్ జట్టుతోపాటే ఆస్ట్రేలియా వెళ్లి ఉండుంటే.. క్వారంటైన్ ఎప్పుడో పూర్తయ్యేది. ఫిట్‌నెస్ సాధించాక.. రెండో టెస్టులో ఆడే అవకాశం ఉండేది. కానీ ఈ విషయంలో సందిగ్ధత నెలకొంది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇబ్బంది తలెత్తుతోంది.

రోహిత్, ఇషాంత్ ఆస్ట్రేలియా వెళ్లడం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తుండటం బాధాకరమని తెలిపింది. ఇషాంత్ ఫిట్‌నెస్ సాధించడానికి నాలుగు వారాల సమయం అవసరమని.. మ్యాచ్ ఫిట్‌నెస్ పొందడానికి మరో 3-4 వారాల సమయం అవసరమని ఎన్‌సీఏ హెడ్ రాహుల్ ద్రావిడ్ దాదాపు నెల రోజుల క్రితం బీసీసీఐకి లేఖ రాశాడు. డిసెంబర్ 17లోగా అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడు.

కానీ ఆస్ట్రేలియా వెళ్లాక 14 రోజులపాటు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. ఆలోగానే మూడు టెస్టులు అయిపోతాయి. అలాంటప్పుడు అతణ్ని ఆస్ట్రేలియా పంపడం అవసరమా? అనే భావనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.

కోహ్లి భారత్ తిరిగొచ్చాక నువ్వు ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంటుందని బీసీసీఐ అధికారులు రోహిత్‌కు సమాచారం ఇచ్చారని.. కానీ రోహిత్ మాత్రం బ్రేక్ కావాలని కోరుకున్నాడని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.