యాప్నగరం

రోహిత్ రికార్డ్ సెంచరీ.. భారత్ భారీ స్కోరు

తొలుత టాస్ గెలిచిన కరేబియన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కొత్త మైదానంపై బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్, ధావన్ శుభారంభాన్ని ఇచ్చారు.

Samayam Telugu 6 Nov 2018, 9:00 pm
లక్నో వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టీ20లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వీర విహారం చేశాడు. టీ20ల్లో నాలుగో సెంచరీని నమోదు చేసి ఈ ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. కెప్టెన్‌గా రెండు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ శర్మ (61 బంతుల్లో 111; 8×4, 7×6)తో పాటు ఓపెనర్ శిఖర్ ధావన్ (41 బంతుల్లో 43; 3×4), లోకేశ్ రాహుల్ (14 బంతుల్లో 26; 2×4, 1×6) రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.
Samayam Telugu Rohit


తొలుత టాస్ గెలిచిన కరేబియన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కొత్త మైదానంపై బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్, ధావన్ శుభారంభాన్ని ఇచ్చారు. తొలి టీ20లో విఫలమైన ధావన్.. ఈ మ్యాచ్‌లో ఆచితూచి ఆడాడు. భారీ షాట్లకు ప్రయత్నించకుండా రోహిత్‌కు చక్కటి సహకారాన్ని అందించాడు. మరోవైపు రోహిత్.. విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 123 పరుగులు భాగస్వామ్యా్ని నెలకొల్పారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. మరోవైపు హాఫ్ సెంచరీకి చేరువైన ధావన్‌ను ఫాబియన్ అలెన్ ఔట్ చేశాడు.

Live Cricket Score: ఇండియా vs విండీస్ రెండో టీ20

ఆ తరవాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్(5) ఎక్కువ సేపు నిలవలేదు. అయితే లోకేశ్ రాహుల్, రోహిత్ శర్మ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేశాడు. విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ వేసిన ఈ ఓవర్‌లో రోహిత్ ఏకంగా 19 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్‌లో బ్రాత్‌వైట్ 20 పరుగులు సమర్పించుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.