యాప్నగరం

ఫీల్డర్‌ని చూస్తూ.. రోహిత్ శర్మ రనౌట్..!

పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కపుగెదర వేగంగా బంతిని సమీపిస్తుండటంతో అతని వైపు చూస్తూ.. బౌలింగ్ ఎండ్‌వైపు

TNN 20 Aug 2017, 7:12 pm
శ్రీలంకతో దంబుల్లా వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో 217 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ ఆదిలోనే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన లసిత్ మలింగ బౌలింగ్‌లో బంతిని పాయింట్ దిశగా తరలించిన రోహిత్ శర్మ (4: 13 బంతుల్లో) సింగిల్ కోసం మరో ఎండ్‌లో ఉన్న శిఖర్ ధావన్‌ని పిలిచాడు. దీనికి ధావన్ కూడా వేగంగా స్పందించడంతో సింగిల్ భారత్‌కి సులభంగా వచ్చేలా కనిపించింది.
Samayam Telugu rohit falls early in the chase
ఫీల్డర్‌ని చూస్తూ.. రోహిత్ శర్మ రనౌట్..!


కానీ.. పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కపుగెదర వేగంగా బంతిని సమీపిస్తుండటంతో అతని వైపు చూస్తూ.. బౌలింగ్ ఎండ్‌వైపు రోహిత్ శర్మ నెమ్మదిగా పరుగెత్తాడు. దీని పసిగట్టిన కపుగెదర గురి చూసి వికెట్లవైపు నేరుగా బంతిని విసరగా.. క్రీజుకి ఒక అడుగు దూరంలో రోహిత్ శర్మ బ్యాట్‌ని జారవిడిచి ముందుకు కదిలాడు. అతని పాదం గాల్లో ఉండగానే బంతిని వికెట్లను గీరాటేయడంతో రోహిత్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఒకవేళ బ్యాట్‌ని జారవిడచకపోయినా రోహిత్‌కి జీవనదానం లభించేంది. మొత్తం వ్యవహారం చూస్తే.. బద్ధకంతోనే లంకేయులకి రోహిత్ శర్మ వికెట్ సమర్పించుకున్నట్లు అయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.