శ్రీలంక బౌలర్లకి వారి సొంతగడ్డపైనే మరోసారి భారత బ్యాట్స్మెన్లు చుక్కలు చూపించారు. కొలంబో వేదికగా గురువారం జరుగుతున్న నాలుగో వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లి ( 131: 96 బంతుల్లో 17x4, 2x6), రోహిత్ శర్మ (104: 88 బంతుల్లో 11x4, 3x6) శతకాల మోత మోగించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 375 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (4) విఫలమైనా.. రోహిత్ శర్మతో కలిసి కోహ్లి టీ20 తరహా ఆటతో రెండో వికెట్కి అభేద్యంగా 221 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా భారీ స్కోరుకి బాటలు వేసుకుంది. మధ్యలో హార్దిక్ పాండ్య (19), లోకేశ్ రాహుల్ (7) తడబడినా చివర్లో మనీశ్ పాండే (50 నాటౌట్: 42 బంతుల్లో 4x4), మహేంద్రసింగ్ ధోని (49 నాటౌట్: 42 బంతుల్లో 5x4, 1x6) మెరుపులు మెరిపించడంతో భారత్ 375 పరుగుల సురక్షిత స్కోరుతో లంకేయులకి సవాల్ విసిరింది.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సిరీస్లో సూపర్ ఫామ్ని కొనసాగిస్తున్న శిఖర్ ధావన్ ఆదిలోనే ఔటైనా.. రోహిత్, కోహ్లి జోడి లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఎడాపెడా బౌండరీలు బాదేసింది. భారత జట్టులో ఐదుగురు మాత్రమే బౌలర్లు ఉండటంతో వీలైనంత ఎక్కువ స్కోరు బోర్డుపై ఉంచాలనే లక్ష్యంతో ఆడిన ఈ జోడి ఓవర్కి కనీసం ఒక బౌండరీ చొప్పున బాదుతూ వచ్చింది. దీంతో ఏ దశలోనూ భారత్ రన్రేట్ 7కి తగ్గలేదు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి కెరీర్లో 29వ శతకం పూర్తిచేసుకోగా.. కొద్దిసేపటికే రోహిత్ శర్మ కూడా 13వ శతకాన్ని అందుకున్నాడు. అయితే ఐదు ఓవర్ల వ్యవధిలోనే ఈ ఇద్దరూ ఔటైనా.. అప్పటికే భారత్ సురక్షిత స్థితిలో నిలిచింది. చివర్లో ధోనీ, మనీశ్ పాండే విలువైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్ రెండు, మలింగ, విశ్వ, ధనంజయ ఒక వికెట్ తీశారు.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సిరీస్లో సూపర్ ఫామ్ని కొనసాగిస్తున్న శిఖర్ ధావన్ ఆదిలోనే ఔటైనా.. రోహిత్, కోహ్లి జోడి లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఎడాపెడా బౌండరీలు బాదేసింది. భారత జట్టులో ఐదుగురు మాత్రమే బౌలర్లు ఉండటంతో వీలైనంత ఎక్కువ స్కోరు బోర్డుపై ఉంచాలనే లక్ష్యంతో ఆడిన ఈ జోడి ఓవర్కి కనీసం ఒక బౌండరీ చొప్పున బాదుతూ వచ్చింది. దీంతో ఏ దశలోనూ భారత్ రన్రేట్ 7కి తగ్గలేదు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లి కెరీర్లో 29వ శతకం పూర్తిచేసుకోగా.. కొద్దిసేపటికే రోహిత్ శర్మ కూడా 13వ శతకాన్ని అందుకున్నాడు. అయితే ఐదు ఓవర్ల వ్యవధిలోనే ఈ ఇద్దరూ ఔటైనా.. అప్పటికే భారత్ సురక్షిత స్థితిలో నిలిచింది. చివర్లో ధోనీ, మనీశ్ పాండే విలువైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. శ్రీలంక బౌలర్లలో మాథ్యూస్ రెండు, మలింగ, విశ్వ, ధనంజయ ఒక వికెట్ తీశారు.