యాప్నగరం

టీ20ల నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిని పక్కనబెట్టే యోచనలో బీసీసీఐ!

టీ20 వరల్డ్ కప్‌ 2022లో సెమీస్‌లోనే భారత్ నిష్క్రమించడంతో జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని బీసీసీఐ భావిస్తోంది. టీ20 జట్టు నుంచి సీనియర్లను పక్కనబెట్టి వారి స్థానంలో యువ ఆటగాళ్లను ఆడించాలని భావిస్తోంది. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యకు టీ20 పగ్గాలు అప్పగించడంతోపాటు.. విరాట్ కోహ్లిని సైతం వన్డేలు, టెస్టులకు పరిమితం చేసే యోచనలో బీసీసీఐ ఉందని సమాచారం. అదే నిజమైతే రోహిత్, కోహ్లి తదితర సీనియర్లు ఇక టీ20ల్లో కనిపించే అవకాశం ఉండదు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 29 Nov 2022, 1:49 pm

ప్రధానాంశాలు:

  • టీ20లకు సీనియర్లను పరిగణలోకి తీసుకోవద్దనే యోచనలో బీసీసీఐ
  • వచ్చే ఏడాది టీ20లకు దూరం కానున్న రోహిత్, కోహ్లి
  • వన్డేలు, టెస్టులపై సీనియర్ ఆటగాళ్ల ఫోకస్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Virat Kohli-Rohit Sharma
Virat Kohli-Rohit Sharma
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్‌లోనే ఇంటి ముఖం పట్టడాన్ని సీరియస్‌గా తీసుకున్న బీసీసీఐ.. టీ20 జట్టులో పూర్తి ప్రక్షాళన దిశగా అడుగులేస్తోంది. సీనియర్లను పూర్తిగా పక్కనబెట్టి.. వచ్చే టీ20 వరల్డ్ కప్ నాటికి కుర్రాళ్లతో పోరుకు సన్నద్ధం కావాలని యోచిస్తోంది. సీనియర్ల భవిష్యత్‌పై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మౌనంగా ఉన్నప్పటికీ.. టీ20ల నుంచి సీనియర్లను తప్పించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
టీ20ల్లో జట్టు పగ్గాలను హార్దిక్ పాండ్యకు అప్పగిస్తారని న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది. జట్టులోని సీనియర్లు టెస్టులు, వన్డేలపై ఫోకస్ చేయనున్నారు. క్రికెటర్లెవర్నీ రిటైర్ కావాలని కోరనప్పటికీ.. నెమ్మదిగా.. దశల వారీగా సీనియర్ ఆటగాళ్లను టీ20ల నుంచి పక్కనబెట్టి.. ఫ్రెష్ టీమ్‌ను 2024 టీ0 వరల్డ్ కప్‌కి రెడీ చేయాలనేది బీసీసీఐ భావనగా కనిపిస్తోంది.

‘రిటైర్ కావాలని బీసీసీఐ ఎవరికీ చెప్పబోదు. అది వ్యక్తిగత నిర్ణయం. 2023లో పెద్దగా టీ20 సిరీస్‌లేవీ లేవు. సీనియర్లు చాలా మంది వన్డేలు, టెస్టు మ్యాచ్‌లపై ఫోకస్ పెడతారు’ అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు.

‘‘రిటైర్ కావొద్దనుకుంటే.. రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం లేదు. వచ్చే ఏడాది చాలా మంది సీనియర్ క్రికెటర్లు టీ20లు ఆడబోరు’’ అని సదరు అధికారి తెలిపారు.

2023లో వన్డే వరల్డ్ కప్ ఉండటంతో.. ఫోకస్ మొత్తం 50వ ఓవర్ల ఫార్మాట్‌పై ఉండనుంది. ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. టీ20ల్లో లాగే ఇప్పటికీ వన్డేల్లోనూ టీమిండియాకు కచ్చితమైన ప్లేయింగ్ ఎలెవన్ లేకపోవడం సమస్యగా మారే అవకాశం ఉంది.

30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లను టీ20ల నుంచి తప్పిస్తారని గతంలోనూ ప్రచారం జరిగింది. అదే జరిగితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లితోపాటు సూర్యకుమార్ యాదవ్ సైతం టీ20లకు దూరం కావాల్సి ఉంటుంది. బంగ్లాదేశ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి రోహిత్ వైదొలిగే అవకాశం ఉంది.

Read More Sports News And Telugu News
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.