యాప్నగరం

Eng vs Ind T20: టీ20 శతకంతో కోహ్లి సరసన రోహిత్ శర్మ..!

భారత విధ్వంసకర ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో ఆదివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో

Samayam Telugu 9 Jul 2018, 9:31 am
భారత విధ్వంసకర ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఇంగ్లాండ్‌తో ఆదివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మెరుపు శతకం బాదిన రోహిత్ శర్మ (100: 56 బంతుల్లో 11x4, 5x6) టీ20ల్లో 2,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌కి ముందు వరకు 1,986 పరుగులతో ఉన్న రోహిత్.. తాజా శతకంతో 2,086 పరుగులతో నిలిచాడు. భారత్ తరఫున రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లి మాత్రమే 2,102 పరుగులతో ఉన్నాడు.
Samayam Telugu rohit sharma becomes 5th player to complete 2000 t20i runs
Eng vs Ind T20: టీ20 శతకంతో కోహ్లి సరసన రోహిత్ శర్మ..!


టీ20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు రోహిత్ శర్మతో కలిపి మొత్తం ఐదుగురు క్రికెటర్లు మాత్రమే 2వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఈ జాబితాలో న్యూజిలాండ్ హిట్టర్లు మార్టిన్ గప్తిల్ (2,271), బ్రెండన్ మెక్‌కలమ్‌ (2,140) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ (2,121) మూడో స్థానంలో.. తర్వాత విరాట్ కోహ్లి (2,102), రోహిత్ శర్మ (2,086) కొనసాగుతున్నారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. ఓపెనర్‌ జేసన్ రాయ్ (67: 31 బంతుల్లో 4x4, 7x6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ అజేయ శతకం బాదడంతో భారత్‌ 18.4 ఓవర్లలోనే 201/3తో అలవోక విజయాన్ని అందుకుంది. దీంతో.. మూడు టీ20ల సిరీస్‌‌ని భారత్ 2-1తో చేజిక్కించుకుంది. భారత్‌‌కి ఇది వరుసగా ఆరో టీ20 సిరీస్‌ విజయం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.