యాప్నగరం

టీమిండియాలో మార్పులు చేస్తా: రోహిత్

శ్రీలంకతో వన్డే సిరీస్‌కి భారత్ జట్టు‌లో మార్పులు ఉంటాయని విరాట్ కోహ్లి స్థానంలో కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ స్పష్టం

TNN 9 Dec 2017, 8:21 pm
శ్రీలంకతో వన్డే సిరీస్‌కి భారత్ జట్టు‌లో మార్పులు ఉంటాయని విరాట్ కోహ్లి స్థానంలో కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ధర్మశాల వేదికగా ఆదివారం ఉదయం 11.30 గంటలకి తొలి వన్డే ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మీడియా సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడాడు. వ్యక్తిగత కారణాలు, గత కొంతకాలంగా ఎడతెరపిలేని క్రికెట్ ఆడుతుండటంతో కెప్టెన్‌ విరాట్ కోహ్లి.. శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌ నుంచి విశ్రాంతి పేరుతో దూరమయ్యాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ముంబయి ఇండియన్స్‌కి మూడు టైటిల్స్‌ని రోహిత్ శర్మ అందించిన విషయం తెలిసిందే.
Samayam Telugu rohit sharma ipl international cricket are completely different
టీమిండియాలో మార్పులు చేస్తా: రోహిత్


‘ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్‌ చాలా భిన్నమైనవి. ఆటగాళ్ల ఆలోచన ధోరణి, ఒత్తిడి స్థాయికూడా పూర్తిగా భిన్నం. జట్టులో నాకు తెలిసి ప్రస్తుతం పెద్దగా మార్పులు చేయాల్సిన పనిలేదు. గత సిరీస్‌లో వన్డే జట్టు ఏ స్థాయి ప్రదర్శన దగ్గర ఆగిందో.. అక్కడ నుంచి కొనసాగించగలిగితే.. చాలు. కాకపోతే.. పిచ్, జట్టు అవసరాల మేరకు తుది జట్టులో కొన్ని మార్పులు చేయాలని అనుకుంటున్నా’ అని రోహిత్ వెల్లడించాడు. తొడకండరాల గాయం కారణంగా ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ శనివారం సాయంత్రం జట్టుకి దూరమవగా.. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ని సెలక్టర్లు ఎంపిక చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.