యాప్నగరం

Team India Captain: కోహ్లి కంటే రోహిత్ బెటర్.. ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ సంచలనం

టీ20, వన్డే పగ్గాలను రోహిత్ శర్మకు అప్పగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చిన నేపథ్యంలో ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ పార్థీవ్ పటేల్ సైతం రోహిత్ వైపు మొగ్గు చూపాడు.

Samayam Telugu 24 Nov 2020, 8:07 am
ముంబై ఇండియన్స్ ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత.. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ విషయమై మాజీలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గంభీర్ లాంటి మాజీ క్రికెటర్లు రోహిత్‌ను కెప్టెన్ చేయకపోతే టీమిండియా నష్టపోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ పార్థీవ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Samayam Telugu Rohit kohli


కెప్టెన్సీ డిబేట్‌లో రోహిత్ శర్మవైపు పార్థీవ్ మొగ్గు చూపాడు. గంభీర్, ఆకాశ్ చోప్రా లాంటి మాజీ క్రికెటర్లతో కలిసి స్టార్ స్పోర్ట్స్ ఇంటరాక్టివ్ సెషన్లో పాల్గొన్న పటేల్.. నిర్ణయాలు తీసుకోవడంలో, ఆటను అర్థం చేసుకోవడంలో కోహ్లి కంటే రోహిత్ కొంచెం ముందుంటాడని తెలిపాడు.

‘‘ఎవరు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు..? ఎవరు ఆటను బాగా అర్థం చేసుకుంటారు..? ఒత్తిడి పరిస్థితుల్లో జట్టు గెలవడానికి సహకరించే నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు..? అనే విషయంలో రోహిత్ కొంచెం ముందుంటాడు’’ అని పటేల్‌ తెలిపాడు.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌‌కు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్.. 2018 ఆసియా కప్‌ టైటిల్‌ను టీమిండియాకు అందించాడు. హిట్‌మ్యాన్ సారథ్యంలోని భారత జట్టు నిదహాస్ ట్రోఫీని గెలుపొందింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.