యాప్నగరం

దినేశ్ కార్తీక్‌ని అందుకే కూర్చోబెట్టాం: రోహిత్

కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో ఆదివారం ముగిసిన ముక్కోణపు టీ20 టోర్నీ ఫైనల్లో దినేశ్ కార్తీక్

TNN 19 Mar 2018, 3:10 pm
కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో ఆదివారం ముగిసిన ముక్కోణపు టీ20 టోర్నీ ఫైనల్లో దినేశ్ కార్తీక్ (29: 8 బంతుల్లో 2x4, 3x6) సంచలన ఇన్నింగ్స్‌తో భారత్‌కి విజయాన్ని అందించాడు. భారత్ శిబిరంలో గెలుపుపై ఆశలు లేని స్థితిలో క్రీజులోకి వచ్చిన కార్తీక్.. తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచి.. అనంతరం వరుసగా 4, 6, 0, 2, 4 బాదేశాడు. ఆఖర్లో.. భారత్ గెలవాలంటే చివరి బంతికి 5 పరుగులు చేయాల్సిన దశలో కళ్లుచెదిరే రీతిలో కార్తీక్ బాదిన సిక్సర్.. అతని బ్యాటింగ్ నైపుణ్యానికి మచ్చుతునకలా నిలిచింది.
Samayam Telugu rohit sharma reveals why he sent vijay shankar ahead of dinesh karthik
దినేశ్ కార్తీక్‌ని అందుకే కూర్చోబెట్టాం: రోహిత్


రాత్రి మ్యాచ్‌ ఉత్కంఠగా మారుతున్న సమయంలో.. దినేశ్ కార్తీక్‌ని అలానే కూర్చొబెట్టి.. అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం లేని విజయ్ శంకర్‌ని అతని స్థానంలో బ్యాటింగ్‌కి పంపడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్తీక్ స్థానంలో వచ్చిన శంకర్ బంతుల్ని వృథా చేసి మ్యాచ్‌ను దాదాపు భారత్‌కి దూరం చేసేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో అతను వరుసగా నాలుగు బంతుల్ని వృథా చేశాడు. దీంతో.. ఈ ఓవర్‌లో భారత్‌కి ఒక పరుగే వచ్చింది. అది కూడా లెగ్‌బై రూపంలో. దీంతో ఈ బ్యాటింగ్‌ మార్పుపై విమర్శలు రాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు.

‘రంజీ, ఐపీఎల్ టోర్నీల్లో దినేశ్ కార్తీక్.. ఆరోస్థానంలోనే బ్యాటింగ్ చేస్తుంటాడు. అతని బ్యాటింగ్ సామర్థ్యమేంటో ముంబయి ఇండియన్స్‌కి ఆడే సమయంలో నేను చూశాను. కార్తీక్ కొన్ని భిన్నమైన షాట్లు ఆడగలడు. డెత్ ఓవర్ల సమయంలో.. ఆ షాట్స్‌ భారత్‌కి చాలా అవసరమని నేను భావించాం. ఈ ఒక్క కారణంతోనే కార్తీక్ అలానే వెనక్కి ఉంచి.. శంకర్‌ని ముందు పంపాం. ఈ బ్యాటింగ్ మార్పు విజయవంతమైంది’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.