యాప్నగరం

Ind vs NZ 2nd ODI: రోహిత్- ధావన్ దెబ్బకి సచిన్- సెహ్వాగ్ రికార్డ్ బ్రేక్

వన్డేల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఓపెనింగ్ జోడీలను ఓసారి పరిశీలిస్తే..! భారత్‌కి చెందిన సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీ జోడీ 21 శతకాలతో అగ్రస్థానంలో ఉంది.

Samayam Telugu 26 Jan 2019, 10:25 am
వన్డే ప్రపంచకప్ ముంగిట భారత ఓపెనర్లు లయ అందుకున్నారు. న్యూజిలాండ్‌తో ఈరోజు జరుగుతున్న రెండో వన్డేలో దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ (87: 96 బంతుల్లో 9x4, 3x6), శిఖర్ ధావన్ (66: 67 బంతుల్లో 9x4) జోడీ.. తొలి వికెట్‌కి 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ద్వారా సచిన్ టెండూల్కర్- వీరేంద్ర సెహ్వాగ్ జోడీ ఏళ్లనాటి అరుదైన రికార్డ్‌ని బ్రేక్ చేసింది. అంతేకాకుండా వన్డే చరిత్రలో అత్యధిక సెంచరీల భాగస్వామ్యం నెలకొల్పిన నాలుగో ఓపెనింగ్ జోడీగా రికార్డుల్లో నిలిచింది.
Samayam Telugu DxzelTPUcAAwh7F


వన్డేల్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఓపెనింగ్ జోడీలను ఓసారి పరిశీలిస్తే..! భారత్‌కి చెందిన సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీ జోడీ 21 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత ఆడమ్ గిల్‌క్రిస్ట్- మాథ్యూ హెడెన్ (ఆస్ట్రేలియా) 16 శతకాలు, గార్డెన్- హేన్స్ (వెస్టిండీస్) 15 శతకాలతో టాప్-3లో ఉన్నారు. తాజాగా 14 శతక భాగస్వామ్యాలతో రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ జోడీ 4వ స్థానానికి ఎగబాకింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.