యాప్నగరం

ఆమ్లా ఒక్క రన్‌తో మిస్సయ్యావ్‌గా..

వందో టెస్టులో శతకం బాదిన ఆమ్లా ఒక్క పరుగు తేడాతో అరుదైన అవకాశాన్ని కోల్పోయాడు.

TNN 13 Jan 2017, 3:24 pm
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో సఫారీ జట్టు మరోసారి తడబాటుకు గురైంది. 41 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయింది. తొలి రోజు 45 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను ఆమ్లా (134), జేపీ డుమిని (155) ఆదుకున్నారు. భారీ సెంచరీలతో కదం తొక్కిన వీరు మూడో వికెట్‌కు 292 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి రోజు ఆట మరి కాసేపట్లో ముగుస్తుందనగా డుమిని అవుటయ్యాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 337 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. డుమిని అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన ఒలివర్ రెండో రోజు ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. 3 పరుగుల వద్ద ఒలివర్ అవుట్ కాగా, కెప్టెన్ డుప్లెసిస్ (16), బవుమా (0) వెంటవెంటనే వెనుదిరిగారు.
Samayam Telugu rsa vs sl hahsim amla missed 50 runs average by 1 run
ఆమ్లా ఒక్క రన్‌తో మిస్సయ్యావ్‌గా..


వందో టెస్టులో సెంచరీ సాధించిన రెండో సఫారీ ప్లేయర్‌గా, ఓవరాల్‌గా ఎనిమిదో బ్యాట్స్‌మెన్‌గా ఆమ్లా రికార్డులు నెలకొల్పిన ఆమ్లా.. రెండో రోజు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. 134 పరుగులు చేసిన ఆమ్లా.. ప్రదీప్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆమ్లా టెస్టు సగటు 49.99గా ఉంది. మరో పరుగు చేసి ఉంటే వందో టెస్టులో 50 సగటును చేరుకునేవాడు. 2014 ఆగష్టు తర్వాత ఆమ్లాకు ఇది తొలిసారి సెంచరీ కావడం విశేషం. ఈ మధ్య కాలంలో సొంత గడ్డమీద 19 ఇన్నింగ్స్ ఆడిన ఆమ్లా.. 8 అర్ధసెంచరీలు సాధించగా.. విదేశాల్లో 14 ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు.

రెండో రోజు శ్రీలంక బౌలర్ ప్రదీప్ అద్భుతంగా రాణించి నాలుగు వికెట్లు తీయడంతో 111 ఓవర్లు ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 8 వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.