యాప్నగరం

క్రికెటర్ దవడ పగిలింది.. 6 వారాలు రెస్ట్

భారత్‌తో జూన్ 15న బర్మింగ్‌హోమ్ వేదికగా బంగ్లాదేశ్ సెమీస్‌లో తలపడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో

TNN 21 Jun 2017, 7:50 pm
ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రుబెల్ హుస్సేన్ తీవ్రంగా గాయపడినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత్‌తో జూన్ 15న బర్మింగ్‌హోమ్ వేదికగా బంగ్లాదేశ్ సెమీస్‌లో తలపడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో గెలుపొందగా.. మ్యాచ్ ముగిసిన అనంతరం బంగ్లాదేశ్‌ జట్టు హోటల్‌కి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు రుబెల్ హుస్సేన్ చెంపకి డోర్ వేగంగా వచ్చి తగిలిందట. దీంతో అతని దవడ చిట్లిందని.. కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట.
Samayam Telugu rubel hossain undergoes surgery after door collision
క్రికెటర్ దవడ పగిలింది.. 6 వారాలు రెస్ట్


‘రుబెల్ హుస్సేన్‌ దవడకి బుధవారం సర్జరీ జరిగింది. అతను కోలుకోవడానికి కనీసం ఆరు వారాల సమయం పడుతుందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఆగస్టు 31 నుంచి ఆస్ట్రేలియా‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ కోసం జట్టు ఎంపికకి అతను అందుబాటులోనే ఉంటాడు’ అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఫిజీషియన్ అమీన్ వెల్లడించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన రుబెల్ హుస్సేన్ కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. ఆస్ట్రేలియాతో రెండు టెస్టుల సిరీస్‌కి ముందు బంగ్లాదేశ్ ఆగస్టు 22 నుంచి ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.