యాప్నగరం

బంగ్లాదేశ్ బౌలర్‌కి తీవ్ర మందలింపు..!

మైదానంలో ఫీల్డ్ అంపైర్‌ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రుబెల్ హుస్సేన్ మ్యాచ్‌ రిఫరీ నుంచి తీవ్ర మందలింపుని

Samayam Telugu 6 Jun 2018, 8:46 pm
మైదానంలో ఫీల్డ్ అంపైర్‌ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ రుబెల్ హుస్సేన్ మ్యాచ్‌ రిఫరీ నుంచి తీవ్ర మందలింపుని ఎదుర్కొన్నాడు. అఫ్గానిస్థాన్‌తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఎల్బీడబ్ల్యూ కోసం రుబెల్ అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ ఆ అప్పీల్‌ని తిరస్కరించాడు. దీంతో.. అంపైర్‌పైకి గుర్రుగా చూస్తూ.. రుబెల్ అసహనం వ్యక్తం చేశాడు.
Samayam Telugu ..


మైదానంలో అంపైర్‌ నిర్ణయంపై అలా అసహనం వ్యక్తం చేయడం క్రమశిక్షణరాహిత్యం కిందకే వస్తుందని తేల్చిన ఐసీసీ.. అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ని చేర్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే 135/4తో ఛేదించింది. తొలి మ్యాచ్‌లో కూడా అఫ్గాన్ జట్టే గెలవగా.. ఆఖరిదైన మూడో టీ20 మ్యాచ్ గురువారం రాత్రి 8 గంటలకి జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.