యాప్నగరం

ధోనీ ఎంపికను అలా చూస్తారేంటి..?

జట్టులో ధోనీని ఆటోమేటిక్ ఛాయిస్‌గా ఏమీ ఎంపిక చేయలేదు. భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం.

TNN 14 Aug 2017, 7:22 pm
శ్రీలంకతో తలపడే వన్డే జట్టు ఎంపిక 2019 ప్రపంచకప్‌ని దృష్టిలో పెట్టుకుని జరిగిందని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. రిషబ్‌పంత్ లాంటి యువ బ్యాట్స్‌మెన్/ వికెట్‌ కీపర్‌కి అవకాశమివ్వకుండా.. ధోనీని ఆటోమేటిక్‌ ఛాయిస్‌గా ఎంపిక చేయడాన్ని కొందరు విమర్శించడంతో సోమవారం ఎమ్మెస్కే ప్రసాద్ ఘాటుగా స్పందించారు. ధోనీని ఎంచుకునే సమయంలో టెన్నిస్ దిగ్గజ ఆటగాడు ఆండ్రీ అగస్సీ గణాంకాలపై మేము చర్చించుకున్నామని ఆయన వివరించారు.
Samayam Telugu s dhoni is not an automatic choice
ధోనీ ఎంపికను అలా చూస్తారేంటి..?


‘అగస్సీ రియల్ కెరీర్‌ 30 ఏళ్లు దాటిన తర్వాతే ప్రారంభమైంది. కెరీర్ చివరాంకంలో అతను ఎన్నో టైటిల్స్ గెలిచి స్ఫూర్తివంతంగా నిలిచాడు. ఇక్కడ జట్టులో ధోనీని ఆటోమేటిక్ ఛాయిస్‌గా ఏమీ ఎంపిక చేయలేదు. భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. రాబోవు మ్యాచ్‌ల్లో అతను ఎలా ఆడతాడో మీరే చూడండి. ఇక రిషబ్ పంత్ అంటారా..? అతను కూడా మా దృష్టిలో ఉన్నాడు. అతను ఇటీవల భారత్- ఎ జట్టు తరపున ఆశించిన మేర రాణించలేకపోయాడు. దీంతో ఇకపై అతనికి టీ20ల్లో ఎక్కువ ఛాన్స్‌లివ్వాలని అనుకుంటున్నాం. హార్దిక్ పాండ్యని కూడా ఇలానే మొదట టీ20ల్లో అవకాశమిస్తూ తయారు చేసుకున్నాం’ అని ఎమ్మెస్కే స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.