శ్రీలంకతో సెంచూరియన్ వేదికగా మంగళవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. శనివారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు.. తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులకి ఆలౌటైంది. ఆ టీమ్లో చండిమాల్ (85), ధనంజయ డిసిల్వా (79), శనక (66) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన దక్షిణాఫ్రికా టీమ్.. డుప్లెసిస్ (199: 276 బంతుల్లో 24x4) చెలరేగడంతో 621 పరుగులు చేసింది. డుప్లెసిస్తో పాటు డీన్ ఎల్గర్ (95), బవుమా (71), మహరాజ్ (73), మర్క్రమ్ (68) బాధ్యతాయుత ఇన్నింగ్స్లు ఆడేశారు.
225 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన శ్రీలంక టీమ్.. అనూహ్యంగా 180 పరుగులకే ఆలౌటైపోయింది. ఆ జట్టులో కుశాల్ పెరీరా (64), హసనరంగ (59) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. కానీ.. లంక జట్టులో ఏకంగా ఐదుగురు బ్యాట్స్మెన్లు డకౌటవగా.. మరో ఇద్దరు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దాంతో.. లంకకి ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, నోర్తేజ్, వియాన్, లూథో తలో రెండు వికెట్లు పడగొట్టారు. విశ్వ రనౌట్ అవగా.. గాయంతో ధనంజయ బ్యాటింగ్కి రాలేదు. ఇక రెండో టెస్టు మ్యాచ్ జనవరి 3 నుంచి జోహనెస్బర్గ్ వేదికగా ప్రారంభంకానుంది.
225 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన శ్రీలంక టీమ్.. అనూహ్యంగా 180 పరుగులకే ఆలౌటైపోయింది. ఆ జట్టులో కుశాల్ పెరీరా (64), హసనరంగ (59) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. కానీ.. లంక జట్టులో ఏకంగా ఐదుగురు బ్యాట్స్మెన్లు డకౌటవగా.. మరో ఇద్దరు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. దాంతో.. లంకకి ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, నోర్తేజ్, వియాన్, లూథో తలో రెండు వికెట్లు పడగొట్టారు. విశ్వ రనౌట్ అవగా.. గాయంతో ధనంజయ బ్యాటింగ్కి రాలేదు. ఇక రెండో టెస్టు మ్యాచ్ జనవరి 3 నుంచి జోహనెస్బర్గ్ వేదికగా ప్రారంభంకానుంది.