యాప్నగరం

ఇంగ్లాండ్‌తో టెస్టులకి సాహా స్థానంలో కార్తీక్..?

ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1నుంచి జరగనున్న టెస్టు సిరీస్‌ కోసం వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్థానంలో దినేశ్ కార్తీక్‌ని భారత సెలక్టర్లు ఎంపిక

Samayam Telugu 16 Jul 2018, 12:11 pm
ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1నుంచి జరగనున్న టెస్టు సిరీస్‌ కోసం వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్థానంలో దినేశ్ కార్తీక్‌ని భారత సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇంగ్లాండ్ గడ్డపై టీ20 సిరీస్ ముగియగా.. మంగళవారం జరగనున్న మూడో వన్డేతో వన్డే సిరీస్‌ కూడా ముగియనుంది. ఆ తర్వాత ఆగస్టు తొలి వారం నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులను భారత్ జట్టు ఆడనుంది.
Samayam Telugu ..


ఐపీఎల్ 2018 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన వృద్ధిమాన్ సాహా కీపింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. అతని చేతి వేలికి తీవ్ర గాయమవడంతో.. కనీసం ఆరు వారాలు విశ్రాంతి తీసుకోవాలని అప్పట్లో వైద్యులు సూచించారు. దీంతో.. గత నెలలో బెంగళూరు వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌కి సాహా దూరమవగా.. అతని స్థానంలో దినేశ్ కార్తీక్‌ ఎంపికయ్యాడు. కానీ.. సాహా ఇప్పటికీ గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధించలేకపోవడంతో అతని స్థానంలో మళ్లీ కార్తీక్‌కి అవకాశమివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంగ్లాండ్‌తో వన్డే జట్టుకి ఎంపికైన దినేశ్ కార్తీక్‌కి.. మిడిలార్డర్‌లో చోటు దక్కడం లేదు. కేఎల్ రాహుల్, సురేశ్ రైనా మెరుగ్గా రాణిస్తుండటంతో అతడ్ని పక్కన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. టెస్టుల్లో ఒకవేళ అవకాశం దక్కితే కార్తీక్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.