యాప్నగరం

దుబాయ్‌లో ధోనీ భార్య బర్త్ డే వేడుకలు.. సాక్షిని సర్‌ప్రైజ్ చేసిన మహీ!

ధోనీ భార్య సాక్షి పుట్టిన రోజు వేడుకలను దుబాయ్‌లో ఘనంగా నిర్వహించారు. ధోనీ, జీవాతోపాటు కొందరు స్నేహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

Samayam Telugu 19 Nov 2020, 4:03 pm
ఐపీఎల్ 2020లో ఆర్సీబీ లాంటి కొన్ని ఫ్రాంచైజీలు క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులను యూఏఈ తీసుకెళ్లడానికి అనుమతి ఇచ్చాయి. కానీ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు. దీంతో ధోనీ సేన యూఏఈ వెళ్లగా.. ధోనీ భార్య సాక్షి, కూతురు జీవా ఇండియాలో నుంచే యెల్లో ఆర్మీకి సపోర్ట్ చేశారు. కానీ ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోనీ తన కుటుంబంతో కలిసి యూఏఈ వెళ్లాడు. తన భార్య సాక్షి పుట్టిన రోజు వేడుక జరపడం కోసం ధోనీ ఫ్యామిలీతోపాటు యూఏఈ వెళ్లాడు. ధోనీతో కలిసి దిగిన ఫొటోను సాక్షి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Samayam Telugu Sakshi dhoni


సాక్షి 32వ పుట్టిన రోజు సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ సైతం సోషల్ మీడియా ద్వారా విష్ చేసింది. ‘సూపర్ బర్త్ డే టు అవర్ సూపర్ తలైవీ’ అంటూ యెల్లో జెర్సీలో ఉన్న ధోనీ పక్కన సాక్షి కూర్చున్న ఫొటోను సీఎస్‌కే ట్వీట్ చేసింది.
ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ఆటతీరు కనబర్చిన సంగతి తెలిసింతే. చెన్నై ఆడిన గత 11 సీజన్లలో తొలిసారి ప్లేఆఫ్ చేరకుండానే లీగ్ దశ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో ధోనీ సేన ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.
View this post on Instagram A post shared by 💛Team Sakshi Singh Dhoni💛 (@sakshidhoni.fc)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.