యాప్నగరం

సాక్షి ధోనీతో ఈ బుడ్డోళ్లు ఎవరు..?

టీమిండియా బుల్లి ‘బాహుబలి’గా అందరితో ముద్దుగా పిలిపించుకుంటున్న జొరావర్ అల్లరి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

TNN 27 Jun 2017, 3:22 pm
కరీబియన్ గడ్డపై భారత్ క్రికెటర్లు సందడి చేస్తున్నారు. విండీస్ పర్యటనలో భాగంగా అక్కడికి కుటుంబంతో కలిసి వెళ్లిన టీమిండియా క్రికెటర్లకి రెండో వన్డే ముగిసిన అనంతరం డ్వేన్ బ్రావో తన ఇంట్లో విందు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విందుకి మహేంద్రసింగ్ ధోనీ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, అజింక్య రహానె తదితరులు కుటుంబంతో సహా హాజరైనట్లు తెలుస్తోంది.
Samayam Telugu sakshi dhoni has a blast with zoravar and bravo junior
సాక్షి ధోనీతో ఈ బుడ్డోళ్లు ఎవరు..?


విందులో భాగంగా తీసుకున్న కొన్ని ఫొటోలను ఇప్పటికే క్రికెటర్లు పంచుకోగా.. తాజాగా ధోనీ భార్య సాక్షి ఒక ఫొటోను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ప్రత్యేకంగా పంచుకుంది. శిఖర్ ధావన్ కొడుకు జొరావర్, డ్వేన్ బ్రావో కొడుకు డ్వేన్ బ్రావో జూనియర్‌లను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ‘నా ఇద్దరు పిల్లలు. ధావన్ జూనియర్, బ్రావో జూనియర్’ అంటూ సాక్షి క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇప్పటికే టీమిండియా బుల్లి ‘బాహుబలి’గా అందరితో ముద్దుగా పిలిపించుకుంటున్న జొరావర్ అల్లరి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  My two boys !!! #dhawanjr #bravojr ! A post shared by Sakshi (@sakshisingh_r) on Jun 26, 2017 at 5:15am PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.