యాప్నగరం

ధోనీపై రూమర్స్‌ ఎక్కడ నుంచి వస్తున్నాయో..?: సాక్షి

2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్‌ గురించి పెద్ద ఎత్తున వార్తలు, రూమర్స్ వినిపించాయి. కానీ.. ధోనీ ఇప్పటి వరకూ కనీసం ఒక్కసారి కూడా స్పందించలేదు. అయితే అతని భార్య సాక్షి మాత్రం రెస్పాండ్ అవుతోంది.

Samayam Telugu 1 Jun 2020, 8:21 am
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై రూమర్స్‌ ఎక్కడ నుంచి వస్తున్నాయో తనకి తెలియడం లేదని అతని భార్య సాక్షి ఆవేదన వ్యక్తం చేసింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో చివరిగా మ్యాచ్‌లాడిన ధోనీ.. ఆ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించేస్తాడని అంతా ఊహించారు. కానీ.. వీడ్కోలుపై మౌనంగా ఉండిపోయిన ధోనీ.. టీమిండియా తరఫున మళ్లీ ఆడింది లేదు. దాంతో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ధోనీ పేరుని తప్పించింది. అయితే.. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని అతను ఆశించాడు. కానీ.. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ నిరవధికంగా వాయిదాపడిన విషయం తెలిసిందే. దాంతో.. ధోనీ రీఎంట్రీ అవకాశాలు సన్నగిల్లాయి.
Samayam Telugu MS Dhoni 2019


వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ గురించి పెద్ద ఎత్తున వార్తలురాగా.. సోషల్ మీడియాలో అతను వీడ్కోలు చెప్పినట్లు #DhoniRetire అనే కీవర్డ్ ట్రెండ్ అయ్యింది. దాంతో.. అప్పట్లో సాక్షి అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది. కానీ.. గత వారం అనూహ్యంగా మళ్లీ అదే కీవర్డ్ ట్రెండ్‌గా మారింది. దాంతో.. ఈసారి సహనం కోల్పోయిన సాక్షి.. లాక్‌డౌన్ వేళ జనాలకి పిచ్చి పట్టిందంటూ గట్టిగా కౌంటరిచ్చింది. కానీ.. నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్‌ని ఆమె డిలీట్ చేసింది.

ధోనీ రిటైర్మెంట్‌ రూమర్స్‌పై తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో సాక్షి మాట్లాడింది. ‘‘మహేంద్రసింగ్ ధోనీ ఈ లాక్‌డౌన్ వేళ సోషల్ మీడియాకి దూరంగా ఉన్నాడు. కానీ.. అతని రిటైర్మెంట్‌పై రూమర్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయో..? నాకు అర్థం కావడం లేదు’’ అని వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.