యాప్నగరం

కుంబ్లే లేకపోతేనేం.. వాళ్లు శిక్షణ ఇస్తున్నారు

జట్టులోని ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది కూడా ఇదే దృక్ప‌థంతో

TNN 7 Dec 2022, 4:07 pm
వెస్టిండీస్ పర్యటనలో భారత్ జట్టుకి ప్రధాన కోచ్ లేని లోటును సీనియర్ క్రికెటర్లు భర్తీ చేస్తున్నారని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ వెల్లడించారు. కోచ్‌గా ఒప్పందం గడువు ముగియడంతో అనిల్ కుంబ్లే గత మంగళవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా వెస్టిండీస్‌తో ఆదివారం రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో మీడియాతో బంగర్ మాట్లాడాడు. ఏ జట్టులోనైనా కోచ్, కెప్టెన్ మధ్య విభేదాలు సహజమేనని.. వాటి అధిగమిస్తూ ముందుకు వెళ్లాలని టీమిండియా భావిస్తున్నట్లు వివరించాడు.
Samayam Telugu Kumble


‘మేము ప్రొఫెషనల్స్. అందుకే ఇలాంటి సమస్యలకి కంగారుపడిపోకుండా ముందుకు సాగాలని ఆశిస్తున్నాం. జట్టులోని ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బంది కూడా ఇదే దృక్ప‌థంతో ఉన్నారు. అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. కానీ.. ప్రస్తుతం అతను లేని లోటును నెట్స్‌లో సీనియర్ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి తీసుకుంటున్నారు. ఈ త్రయం అనుభవం దాదాపు 700 మ్యాచ్‌లు. ప్రాక్టీస్ సెషన్‌‌లో ఆటగాళ్లకి వాళ్లే సూచనలు చేస్తున్నారు’ అని బంగర్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.