యాప్నగరం

పుజారా శతకం.. ఫైనల్‌కి చేరువలో సౌరాష్ట్ర

గురువారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు 275 పరుగులకి ఆలౌటవగా.. తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 236 పరుగులకే కుప్పకూలింది.

Samayam Telugu 27 Jan 2019, 7:09 pm
ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల టెస్టుల్లో పరుగుల వరద పారించిన భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా.. దేశవాళీ టోర్నీ ‘రంజీ ట్రోఫీ’లోనూ అదే జోరుని కొనసాగిస్తున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటకతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పుజారా (108 నాటౌట్: 216 బంతుల్లో 14x4) అజేయ శతకం బాదడంతో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న సౌరాష్ట్ర జట్టు విజయానికి చేరువలో ఉంది. ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర గెలిస్తే..? విదర్భ జట్టుతో ఆదివారం నుంచి ఫైనల్లో తలపడుతుంది.
Samayam Telugu saurashtra vs karnataka cheteshwar pujara unbeaten century puts saurashtra on course for victory
పుజారా శతకం.. ఫైనల్‌కి చేరువలో సౌరాష్ట్ర


ఆటలో నాలుగో రోజైన ఆదివారం 278 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సౌరాష్ట్ర జట్టు ఆరంభంలోనే ఓపెనర్లు దేశాయ్ (9), పాటిల్ (0)‌తో పాటు విశ్వరాజ్ జడేజా (0) వికెట్లు చేజార్చుకుని 23/3తో నిలిచింది. ఈ దశలో క్రీజులో నిలిచిన పుజారా మరో బ్యాట్స్‌మెన్ జాక్సన్ (90 నాటౌట్: 205 బంతుల్లో 13x4)తో కలిసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ జోడీ నాలుగో వికెట్‌కి అభేద్యంగా 204 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఈరోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర 224/3తో నిలిచింది. విజయానికి 55 పరుగులు చేయాల్సి ఉండగా.. చేతిలో 7 వికెట్ల ఉండటంతో.. సౌరాష్ట్ర గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది.

గురువారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు 275 పరుగులకి ఆలౌటవగా.. తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర 236 పరుగులకే కుప్పకూలింది. దీంతో.. 39 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌లో 239 పరుగులకి ఆలౌటై.. 278 పరుగుల భారీ లక్ష్యాన్ని సౌరాష్ట్రాకి నిర్దేశించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.