యాప్నగరం

వెస్టిండీస్ జట్టు భారత పర్యటన షెడ్యూల్ ఇదే!

వెస్టిండీస్ జట్టు అక్టోబర్, నవంబర్ నెలల్లో భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన వివరాలు మీకోసం.

Samayam Telugu 30 Aug 2018, 12:18 pm
కరేబియన్ జట్టు భారత పర్యటన వివరాలను వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. ఈ సందర్భంగా 15 మందితో జట్టును కూడా సెలక్టర్లు ప్రకటించారు. అక్టోబర్ 4 నుంచి వెస్టిండీస్ జట్టు భారత గడ్డ మీద రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 28న ఆసియా కప్ ఫైనల్ జరగనుండగా.. ఆ వెంటనే భారత జట్టు సొంత గడ్డ మీద వెస్టిండీస్‌తో తలపడనుంది. తొలి టెస్టు మ్యాచ్‌కు రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదిక కానుంది. తర్వాతి టెస్టుకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.
Samayam Telugu kohli vs wi

టెస్టు జట్టు: జాసన్ హోల్డర్ (కెప్టెన్), సునీల్ ఆంబ్రిస్, దేవేంద్ర బిషూ, బ్రాత్‌వైట్, రోస్టన్ ఛేజ్, షేన్ డోరిచ్, షన్నాన్ గ్రాబియెల్, జహ్మీర్ హమిల్టన్, షిమ్రాన్ హెట్మెర్, షాయ్ హోప్, అల్జరీ జోసెఫ్, కీమో పాల్, కీరన్ పావెల్, కెమెర్ రోచ్, జోమెల్ వరికన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.