యాప్నగరం

సెహ్వాగ్ ట్వీట్ ఈసారి జడేజాను తాకింది

ట్విట్టర్లో సందర్భానుసారంగా స్పందిస్తూ నెటిజన్లకు వినోదాన్ని పంచుతున్న వీరేంద్ర సెహ్వాగ్ ఇప్పుడు రవీంద్ర జడేజాపై ఫోకస్ పెట్టాడు.

TNN 1 Dec 2016, 9:30 am
ఒకప్పుడు ఓపెనర్‌గా బరిలోకి దిగి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించిన టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్.. ఇప్పుడు తనదైన ట్వీట్లతో, కామెంట్రీతో అభిమానులను అలరిస్తున్నాడు. ట్విట్టర్లో సందర్భానుసారంగా స్పందిస్తూ నెటిజన్లకు వినోదాన్ని పంచుతున్నాడు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో ఏర్పడిన ప్రస్తుత పరిస్థితికి, మొహాలీలో జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు ముడిపెట్టి తాజాగా ఓ ట్వీట్ వదిలాడు. అదెలా అంటే.. మొహాలీ టెస్టులో ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. దీంతో పేటీఎం సంస్థ అతడి అకౌంట్లో లక్ష రూపాయల నగదును జమ చేసింది. ఇదే విషయమై సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
Samayam Telugu sehwag tweet on ravindra jadejas man of the match trolls now
సెహ్వాగ్ ట్వీట్ ఈసారి జడేజాను తాకింది


జడ్డూ భాయ్.. మా దగ్గరేమో రెండు వేల రూపాయలకు చిల్లర కూడా లేదు. నీ ఖాతాలో పేటీఎం ఏకంగా లక్ష రూపాయలు జమ చేసింది. కొద్ది మొత్తాన్ని నా పేటీఎం అకౌంట్‌కు కూడా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చుగా అంటూ ట్వీట్ చేశాడు. అంతే.. ఈ ట్వీట్‌కు ఏకంగా 13 వేల మంది లైక్ కొట్టగా, దాదాపు మూడు వేల మంది రీ ట్వీట్ చేశారు. మరి సెహ్వాగా మజాకా.

Wah Jaddu Bhai ! Hamare paas toh 2000 ke chhutte nahi hai aur aap @Paytm mein 1 Lakh le gaye. Thoda hamare Paytm mein bhi transfer kijiye 📲💰 pic.twitter.com/IEKdp7cIdp— Virender Sehwag (@virendersehwag) November 29, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.