ఫార్మాట్ ఏదైనా ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బాదుడు మొదలెట్టే పాకిస్థాన్ ఆల్ రౌండర్ బూమ్.. బూమ్ అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ హిట్టర్ చివరగా ఒక టీ20 మ్యాచ్కి అవకాశమివ్వండి గౌరవంగా తప్పుకుంటానని గత ఏడాది నుంచి పాక్ క్రికెట్ బోర్డును అభ్యర్థిస్తున్నాడు. కానీ బోర్డు నుంచి సరైన స్పందన రాకపోవడంతో అఫ్రిది నిరాశతోనే వీడ్కోలు తీసుకున్నాడు. భారత్లో గత ఏడాది ముగిసిన టీ20 ప్రపంచకప్లో చివరిసారిగా అఫ్రిది పాక్ తరఫున ఆడాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) టోర్నీలో ఆడుతున్న అఫ్రిది ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో 28 బంతుల్లో అర్ధశతకం చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం అఫ్రిది మాట్లాడుతూ ‘నేను అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను. పాకిస్థాన్ కోసం నిజాయితీగా నిబద్ధతతో 21ఏళ్లు క్రికెట్ ఆడాను. అయితే నా అభిమానుల కోసం మరో రెండేళ్ల పాటు ప్రైవేట్ లీగ్లు మాత్రం ఆడతాను. కెరీర్ గురించి నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరైన సమయమేమో’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. 2010లో టెస్టుల నుంచి, ప్రపంచకప్ 2015 అనంతరం వన్డేల నుంచి అఫ్రిది రిటైర్మెంట్ ప్రకటించి టీ20లు మాత్రమే ఆడాడు. అయితే గత ఏడాది టీ20 ప్రపంచకప్ అనంతరం అఫ్రిదిని కెప్టెన్సీ నుంచి తప్పించిన పాకిస్థాన్ బోర్డు.. చివరి వరకూ అతనికి జట్టులో అవకాశమివ్వలేదు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) టోర్నీలో ఆడుతున్న అఫ్రిది ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో 28 బంతుల్లో అర్ధశతకం చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం అఫ్రిది మాట్లాడుతూ ‘నేను అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను. పాకిస్థాన్ కోసం నిజాయితీగా నిబద్ధతతో 21ఏళ్లు క్రికెట్ ఆడాను. అయితే నా అభిమానుల కోసం మరో రెండేళ్ల పాటు ప్రైవేట్ లీగ్లు మాత్రం ఆడతాను. కెరీర్ గురించి నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరైన సమయమేమో’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. 2010లో టెస్టుల నుంచి, ప్రపంచకప్ 2015 అనంతరం వన్డేల నుంచి అఫ్రిది రిటైర్మెంట్ ప్రకటించి టీ20లు మాత్రమే ఆడాడు. అయితే గత ఏడాది టీ20 ప్రపంచకప్ అనంతరం అఫ్రిదిని కెప్టెన్సీ నుంచి తప్పించిన పాకిస్థాన్ బోర్డు.. చివరి వరకూ అతనికి జట్టులో అవకాశమివ్వలేదు.