భారత్తో ఆదివారం రాత్రి జరిగిన ముక్కోణపు టీ20 టోర్నీ ఫైనల్లో దాదాపు చేతికొచ్చేసిన మ్యాచ్.. ఫాస్ట్ బౌలర్ రుబెల్ హుస్సేన్ కారణంగా చేజారిందని బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో 167 పరుగుల లక్ష్యాన్ని దినేశ్ కార్తీక్ (29 నాటౌట్: 8 బంతుల్లో 2x4, 3x6) సంచలనాత్మక ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. భారత్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 34 పరుగులు అవసరమైన దశలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్.. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన రుబెల్ హుస్సేన్ బౌలింగ్లో వరుసగా 6, 4, 6, 0, 2, 4, బాదేశాడు. దీంతో.. ఒక్కసారిగా మ్యాచ్ భారత్వైపు మొగ్గింది.
‘రుబెల్ హుస్సేన్ బంగ్లాదేశ్ జట్టు అత్యుత్తమ బౌలర్. ఫైనల్లో అతను తొలి మూడు ఓవర్లు చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. దీంతో.. 19వ ఓవర్ అతనికే ఇవ్వాలని నిర్ణయించాం. భారత్ విజయానికి 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సి ఉండటంతో.. ఒకవేళ రుబెల్ 15 పరుగులిచ్చినా.. చివరి ఓవర్లో నియంత్రించుకోవచ్చని భావించా. కానీ.. కార్తీక్ దూకుడుతో తొలి మూడు బంతుల్లోనే అతను 18 పరుగులు సమర్పించుకున్నాడు. అప్పటికీ.. ఆ ఓవర్ మధ్యలో రుబెల్ వద్దకి వెళ్లి.. కెప్టెన్గా నా మద్దతు తెలిపాను. కానీ.. కార్తీక్ దూకుడుతో రుబెల్ లయ తప్పాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచిన బ్యాట్స్మెన్లు చాలా మందే ఉన్నారు. కానీ.. అదే హిట్టింగ్ని కొనసాగించే ఆటగాళ్లు చరిత్రలో కొందరే ఉన్నారు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని దినేశ్ కార్తీక్ సిక్స్గా మలిచిన తీరు అమోఘం. అది అంత సులువు కాదు. ఒక్క ఓవర్లోనే మ్యాచ్ని అతను బంగ్లాకి దూరం చేసేశాడు. ఓటములే జట్టుకి ఎక్కువ పాఠాలు నేర్పుతాయి’ అని షకిబ్ అల్ హసన్ వెల్లడించాడు.
‘రుబెల్ హుస్సేన్ బంగ్లాదేశ్ జట్టు అత్యుత్తమ బౌలర్. ఫైనల్లో అతను తొలి మూడు ఓవర్లు చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. దీంతో.. 19వ ఓవర్ అతనికే ఇవ్వాలని నిర్ణయించాం. భారత్ విజయానికి 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సి ఉండటంతో.. ఒకవేళ రుబెల్ 15 పరుగులిచ్చినా.. చివరి ఓవర్లో నియంత్రించుకోవచ్చని భావించా. కానీ.. కార్తీక్ దూకుడుతో తొలి మూడు బంతుల్లోనే అతను 18 పరుగులు సమర్పించుకున్నాడు. అప్పటికీ.. ఆ ఓవర్ మధ్యలో రుబెల్ వద్దకి వెళ్లి.. కెప్టెన్గా నా మద్దతు తెలిపాను. కానీ.. కార్తీక్ దూకుడుతో రుబెల్ లయ తప్పాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచిన బ్యాట్స్మెన్లు చాలా మందే ఉన్నారు. కానీ.. అదే హిట్టింగ్ని కొనసాగించే ఆటగాళ్లు చరిత్రలో కొందరే ఉన్నారు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని దినేశ్ కార్తీక్ సిక్స్గా మలిచిన తీరు అమోఘం. అది అంత సులువు కాదు. ఒక్క ఓవర్లోనే మ్యాచ్ని అతను బంగ్లాకి దూరం చేసేశాడు. ఓటములే జట్టుకి ఎక్కువ పాఠాలు నేర్పుతాయి’ అని షకిబ్ అల్ హసన్ వెల్లడించాడు.