భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీతో ఆస్ట్రేలియా జట్టుకి తిప్పలు తప్పవని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేసన్ గిలెస్పీ హెచ్చరించాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 7 నుంచి ఇంగ్లాండ్లో ఓవల్ స్టేడియం వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్స్ ప్రిపరేషన్స్ గురించి మాట్లాడిన గిలెస్పీ.. మహ్మద్ షమీ ఇప్పుడు మంచి టచ్లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ టీమ్కి ఆడిన మహ్మద్ షమీ 17 మ్యాచ్లాడి 28 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా కూడా నిలిచిన షమీ పర్పుల్ క్యాప్ని సొంతం చేసుకున్నాడు. అలానే టెస్టుల్లోనూ ఆస్ట్రేలియాపై షమీకి మెరుగైన రికార్డ్ ఉంది. ఆసీస్పై 11 మ్యాచ్లాడిన ఈ సీనియర్ పేసర్ 40 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్ మ్యాచ్ జరగబోతున్న ఇంగ్లాండ్ గడ్డపై కూడా 13 మ్యాచ్లాడిన షమీ 38 వికెట్లు తీశాడు. కానీ ఇంగ్లాండ్ నేలపై 5 వికెట్ల మార్క్ని అతను అందుకోలేకపోవడం ఒక్కటే లోటు.
మహ్మద్ షమీ గురించి గిలెస్పీ మాట్లాడుతూ ‘‘భారత్ తరఫున షమీ నిలకడగా రాణిస్తున్నాడు. అతని సీమ్, బాల్ రిలీజింగ్ పొజీషన్ బాగుంది. షమీ తనదైన టెక్నిక్తో బంతిని పట్టుకుని చక్కగా స్వింగ్ రాబడుతున్నాడు. ఓవల్ పిచ్ కొంచెం సహకరించినా అతను బంతి నుంచి స్వింగ్ రాబడుతూ ఆస్ట్రేలియా బ్యాటర్లకి సవాల్ విసరగలడు. కాబట్టి మ్యాచ్లో షమీ పాత్ర కీలకంకానుంది’’ అని గిలెస్పీ చెప్పుకొచ్చాడు.
మహ్మద్ షమీ గురించి గిలెస్పీ మాట్లాడుతూ ‘‘భారత్ తరఫున షమీ నిలకడగా రాణిస్తున్నాడు. అతని సీమ్, బాల్ రిలీజింగ్ పొజీషన్ బాగుంది. షమీ తనదైన టెక్నిక్తో బంతిని పట్టుకుని చక్కగా స్వింగ్ రాబడుతున్నాడు. ఓవల్ పిచ్ కొంచెం సహకరించినా అతను బంతి నుంచి స్వింగ్ రాబడుతూ ఆస్ట్రేలియా బ్యాటర్లకి సవాల్ విసరగలడు. కాబట్టి మ్యాచ్లో షమీ పాత్ర కీలకంకానుంది’’ అని గిలెస్పీ చెప్పుకొచ్చాడు.