యాప్నగరం

​ విరాట్ కోహ్లి మాట జయించుకున్నాడా..?

రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రం భారత్ జట్టు ధర్మశాలకి చేరుకోగా.. మహ్మద్ షమీ బుధవారం ఉదయం

TNN 22 Mar 2017, 3:15 pm
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 1-1తో సిరీస్ సమం అవడంతో ధర్మశాల వేదికగా శనివారం నుంచి జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. రాంచీ టెస్టులో విజయం సాధించేందుకు అవకాశమున్నా.. భారత్ బౌలర్లు చివరి రోజు తేలిపోవడంతో కోహ్లి నిరాశ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో ధర్మశాల టెస్టుకి ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు కోహ్లి ఇప్పటికే ప్రకటించాడు. దీనికి తగినట్లుగా సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్‌తో కోహ్లి చర్చించి.. షమీకి లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది.
Samayam Telugu shami joins team in dharamsala
​ విరాట్ కోహ్లి మాట జయించుకున్నాడా..?


రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రం భారత్ జట్టు ధర్మశాలకి చేరుకోగా.. మహ్మద్ షమీ బుధవారం ఉదయం అక్కడికి చేరుకున్నాడు. ‘ధర్మశాల ఉదయం అందంగా ఉందంటూ’ షమీ సోషల్ మీడియా ద్వారా తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో అతను నాలుగో టెస్టులో బరిలోకి దిగనున్నట్లు అర్థమవుతోంది. ఆదివారం ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ నాలుగు వికెట్లు తీసి తన ఫిటెనెస్‌ని నిరూపించుకున్నాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్ అనంతరం గాయం కారణంగా టీమిండియాకి షమీ దూరమైన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.