యాప్నగరం

అంపైర్‌ని ఆట పట్టించిన విరాట్ కోహ్లి

భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి తన సొంత మైదానంలో బ్యాట్‌తో పాటు.. హావభావాలతోనూ అభిమానుల్ని అలరించే ప్రయత్నం

TNN 5 Dec 2017, 4:29 pm
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి తన సొంత మైదానంలో బ్యాట్‌తో పాటు.. హావభావాలతోనూ అభిమానుల్ని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఫీల్డ్ అంపైర్ నిగేల్ లాంగ్‌ని కాసేపు కోహ్లి ఆట పట్టించాడు. శ్రీలంక ఓపెనర్ సమరవిక్రమ డీఆర్ఎస్ కోరిన సమయంలో ఈ సరదా సన్నివేశం మైదానంలో చోటు చేసుకుంది.
Samayam Telugu shami nips out samarawickwrama
అంపైర్‌ని ఆట పట్టించిన విరాట్ కోహ్లి


410 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా మంగళవారం సాయంత్రం రెండో ఇన్నింగ్స్‌ని ఆరంభించిన శ్రీలంక జట్టు ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది. భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ విసిరిన బౌన్సర్ బంతి‌ని వదిలేసే ప్రయత్నంలో సమరవిక్రమ (5) తడబడ్డాడు. పైపైకి.. వస్తున్న బంతి నుంచి తప్పించుకునే క్రమంలో భాగంగా సమరవిక్రమ వెనక్కి వంగగా.. బంతి అతని చేతి గ్లౌవ్స్‌ని తాకి స్లిప్‌లో రహానె చేతిలో పడింది. దీంతో ఫీల్డ్ అంపైర్ నిగేల్ లాంగాన్ ఔట్‌గా ప్రకటించగా.. సమరవిక్రమ ఆ నిర్ణయంపై సమీక్ష(డీఆర్ఎస్)‌కి వెళ్లాడు. రిప్లైని థర్డ్‌ అంపైర్‌ పరిశీలిస్తుండగానే లాంగాన్‌ దగ్గరికి వెళ్లిన కోహ్లి ఔట్.. ఔట్.. ఇక ఇవ్వండంటూ కాసేపు ఆటపట్టించాడు. కోహ్లి సరదా చేష్టల్ని నిగేల్ లాంగాన్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. లంక 14 పరుగుల వద్దే తొలి వికెట్ కోల్పోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.