యాప్నగరం

మ్యాచ్‌లో సవాల్ ఎదురైతే ధోనీ దగ్గరకెళ్తా..!

మైదానంలో ఏదైనా సవాల్ ఎదురైతే వెంటనే సలహా కోసం వికెట్‌ కీపర్ మహేంద్రసింగ్ ధోనీని కలుస్తానని

TNN 6 Sep 2017, 4:01 pm
మైదానంలో ఏదైనా సవాల్ ఎదురైతే వెంటనే సలహా కోసం వికెట్‌ కీపర్ మహేంద్రసింగ్ ధోనీని కలుస్తానని భారత ఫాస్ట్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ వెల్లడించాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన ఐదు వన్డేల సిరీస్‌‌తో టీమిండియాలోకి అరంగేట్రం చేసిన ఈ యువ బౌలర్.. తుది జట్టులో ఛాన్స్ దక్కిన చివరి రెండు వన్దేల్లోనూ ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ సమయంలో ధోనీ సూచనలు, సలహాలతోనే మెరుగైన ప్రదర్శన చేయగలిగానని.. శ్రీలంకతో సిరీస్‌లోనూ అతని సాయం తీసుకున్నట్లు శార్ధూల్ వివరించాడు. ఐపీఎల్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌కి ఈ ఇద్దరూ ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.
Samayam Telugu shardul thakur says ms dhoni helped him
మ్యాచ్‌లో సవాల్ ఎదురైతే ధోనీ దగ్గరకెళ్తా..!


‘ఐపీఎల్ సమయంలో ధోనీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అతను జట్టుకి వికెట్‌ కీపర్ కాబట్టి.. ఇప్పటికే చాలా మంది బౌలింగ్‌ని మరో ఎండ్‌ నుంచి చూసుంటాడు. ఒకవేళ నాకు మ్యాచ్‌లో ఏదైనా సవాల్ ఎదురైతే.. అంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ నా బౌలింగ్‌లో ఎదురుదాడి చేస్తుండటం లేదా బౌలింగ్ లయ కుదరకపోవడం లాంటి సమస్యలకి ధోనీ మెరుగైన సలహాలు ఇస్తాడు. ఇప్పటికే ఎన్నోసార్లు ధోనీ సాయంతో నేను గట్టెక్కగలిగాను. మ్యాచ్‌ల్లో అతని సాయం మరువలేనిది’ అని శార్ధూల్ వివరించాడు. బుధవారం శ్రీలంకతో జరగనున్న ఏకైక టీ20 మ్యాచ్‌కి శార్ధూల్‌‌ ఆడే అవకాశాలు తక్కువే. గాయంతో చివరి వన్డేకి దూరమైన హార్దిక్ పాండ్య అతని స్థానంలో మళ్లీ జట్టులోకి రానున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.