ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్గా మాజీ బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవి కోసమే బీసీసీఐ అధ్యక్షునిగా తప్పుకున్నట్టు ఆయనే చెప్పారు. ఎన్నిక ప్రక్రియ మొత్తం ఏకపక్షంగా సాగింది. ఐసీసీ డైరెక్టర్లుగా ఉన్న వారు తమ తరుపున ఐసీసీ ఛైర్మన్గా ఎవరుంటే బాగుంటుందో ఒక్కో పేరును సూచిస్తారు. ఆ వ్యక్తి కచ్చితంగా బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసి ఉండాలి. అలా డైరెక్టర్లందరూ శశాంక్ మనోహర్ పేరునే ప్రతిపాదించారు. దీంతో ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఆయన పదవి చేపడతారు. రెండేళ్ల పాటూ ఐసీసీ ఛైర్మన్ గా కొనసాగుతారు. కాగా శశాంక్ మనోహర్ మాట్లాడుతూ... ఇది తనకు చాలా గౌరవాన్ని తెచ్చిన అంశమని అన్నారు. తన పేరును ప్రతిపాదించిన ఐసీసీ డైరెక్టర్లందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఐసీసీ ఛైర్మన్గా శశాంక్ మనోహర్ ఎన్నిక
ఐసీసీ ఛైర్మన్గా మాజీ బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
TNN 12 May 2016, 12:38 pm