యాప్నగరం

కోహ్లి-కుంబ్లే గొడవపై స్పందించిన ధావన్

ఈ ఏడాది ఐపీఎల్ ముందు వరకు నేను చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాను. పేలవ ఫామ్‌తో టీమిండియాలో స్థానం

Samayam Telugu 29 Jun 2017, 5:21 pm
భారత్ క్రికెట్లో గత కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారిన కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే గొడవపై ఓపెనర్ శిఖర్ ధావన్ స్పందించాడు. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో శతకం బాది మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ధావన్.. తాజా వెస్టిండీస్ పర్యటనలోనూ వరుసగా రెండు అర్ధశతకాలతో రాణించాడు. శుక్రవారం సాయంత్రం మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో ధావన్ మీడియాతో మాట్లాడాడు.
Samayam Telugu shikhar dhawan comments on kohli kumble controversy
కోహ్లి-కుంబ్లే గొడవపై స్పందించిన ధావన్


‘ఈ ఏడాది ఐపీఎల్ ముందు వరకు నేను చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాను. పేలవ ఫామ్‌తో టీమిండియాలో స్థానం కోల్పోవాల్సి వచ్చింది. దీంతో దేశవాళి క్రికెట్ ఆడుతూ మళ్లీ నా సామర్థ్యం నిరూపించుకున్నాను. రంజీల్లో బాగా ఆడితే భారత్ జట్టులోకి రావచ్చని నాకు తెలుసు. అందుకే ఒత్తిడిని పూర్తిగా వదిలేసి స్వేచ్ఛగా దేశవాళీ మ్యాచ్‌లను ఆస్వాదించడం మొదలెట్టాను’ అని ధావన్ వివరించాడు.

కెప్టెన్ కోహ్లి, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే మధ్య విభేదాలేంటి..? అని ప్రశ్నించగా.. ‘నేను అనిల్ కుంబ్లే శిక్షణలో ఎక్కువగా భారత్ జట్టుకు ఆడలేదు. కాబట్టి ఈ విభేదాలపై నేను ఏమీ మాట్లాడలేను. అయితే ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అభిప్రాయం, ఆత్మాభిమానం ఉంటాయి. ఇందులో అనిల్ కుంబ్లే, ధోనీ, కోహ్లి.. ఒక్కరేంటి అందరూ భిన్నంగానే వ్యవహరిస్తారు’ అని ధావన్ తెలివిగా సమాధానం చెప్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.