యాప్నగరం

ధావన్‌పై వేటు.. మయాంక్‌కు చోటు.. విండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

వెస్టిండీస్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్ కోసం సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు.

Samayam Telugu 30 Sep 2018, 7:41 am
సొంత గడ్డ మీద వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ కోసం సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో పేలవ ఆటతీరు కనబర్చిన శిఖర్ ధావన్‌ను సెలక్టర్లు పక్కనబెట్టారు. ఆసియా కప్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచినప్పటికీ.. ధావన్‌ను ఎంపిక చేయకపోవడం గమనార్హం. మరో ఓపెనర్ మురళీ విజయ్‌కు కూడా సెలక్షన్ కమిటీ అవకాశం ఇవ్వలేదు. నవంబర్ చివర్లో ఆస్ట్రేలియా పర్యటన ఉండటంతో.. కీలక బౌలర్లు బుమ్రా, భువీలకు విశ్రాంతిచ్చారు. ఫిటెనెస్ సరిగా లేకపోవడంతో ఇషాంత్, హార్దిక్ పాండ్యలకు కూడా జట్టులో చోటు దక్కలేదు.
Samayam Telugu dhawan mayank


గత కొంత కాలంగా దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న కర్ణాటక బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్‌కు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. యువ ఓపెనర్ పృథ్వీ షాకు కూడా పిలుపు అందింది. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు భారత్ తరఫున తొలి టెస్టు ఆడే అవకాశం దక్కనుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్టులో అరంగేట్రం చేసి ఆకట్టుకు ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారీ తన స్థానం కాపాడుకున్నాడు. రిషబ్ పంత్‌ను సెలక్టర్లు మళ్లీ ఎంపిక చేశారు.

రాజ్‌కోట్ వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ఆరంభం కానుండగా.. అక్టోబర్ 12 నుంచి హైదరాబాద్ వేదిక రెండో టెస్టు జరగనుంది. టెస్టు సిరీస్ ముగిశాక భారత్, విండీస్ జట్లు ఐదు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనున్నాయి.

భారత జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, చటేశ్వర పుజారా, అజింక్య రహానే, హనుమ విహారీ, రిషబ్ పంత్, అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.