యాప్నగరం

West Indies గడ్డపై అరుదైన రికార్డ్ ముంగిట కెప్టెన్ శిఖర్ ధావన్

Shikhar Dhawan కెప్టెన్‌గా అరుదైన రికార్డ్‌ ముంగిట ఉన్నాడు. 2002 నుంచి నలుగురు భారత కెప్టెన్లు విండీస్ గడ్డపై వన్డే సిరీస్‌లు గెలిచారు. తాజాగా ఐదో కెప్టెన్‌గా నిలిచిన గబ్బర్.. ఒకవేళ ఈరోజు ఆఖరి వన్డేలో టీమిండియాని గెలిపించగలిగితే?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 27 Jul 2022, 5:04 pm

ప్రధానాంశాలు:

  • విండీస్ గడ్డపై కెప్టెన్‌గా రాణిస్తున్న శిఖర్ ధావన్
  • వరుసగా రెండు వన్డేల్లో భారత్ గెలుపు
  • ఈరోజు రాత్రి 7 గంటలకి ఫైనల్ వన్డే
  • భారత్ గెలిస్తే? గబ్బర్ అరుదైన ఘనత
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Shikhar Dhawan (Pic Source: Twitter)
Shikhar Dhawan (Pic Source: Twitter)
వెస్టిండీస్ గడ్డపై కెప్టెన్‌గా శిఖర్ ధావన్ (Shikhar Dhawan) మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పటికే ముగిసిన రెండు వన్డేల్లో జట్టుని ముందుండి నడిపించిన గబ్బర్.. ఈరోజు రాత్రి 7 గంటలకి ట్రినిడాడ్ వేదికగా జరగనున్న మూడో వన్డేలోనూ టీమిండియాని గెలిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. సిరీస్ కూడా 2-0తో ఇప్పటికే భారత్‌కి సొంతమైన నేపథ్యంలో.. ఈరోజు టీమిండియా స్వేచ్ఛగా చెలరేగిపోయే అవకాశం ఉంది.
వెస్టిండీస్‌లో ఇప్పటి వరకూ కేవలం నలుగురు భారత కెప్టెన్లు మాత్రమే వన్డే సిరీస్‌ని గెలిచారు. వారిలో సౌరవ్ గంగూలీ ముందుండగా.. ఆ తర్వాత మహేంద్రసింగ్ ధోనీ, సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ ఉన్నారు. తాజాగా శిఖర్ ధావన్ కూడా ఆ జాబితాలో చేరాడు. అయితే.. ఆ నలుగురిలో ఏ కెప్టెన్ కూడా విండీస్ గడ్డపై వన్డే సిరీస్‌ని క్లీన్‌స్వీప్ చేయలేకపోయారు. దాంతో.. ఒకవేళ ఈరోజు ఆఖరి వన్డేలో భారత్ జట్టు గెలిస్తే? మూడు వన్డేల సిరీస్‌ని 3-0 టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తుంది. అప్పుడు ఆ ఘనత సాధించిన తొలి భారత కెప్టెన్‌గా శిఖర్ ధావన్ నిలవనున్నాడు.

2002 వరకూ విండీస్ గడ్డపై భారత్ జట్టుకి వన్డే సిరీస్‌ గెలుపు లేదు. కానీ.. అప్పట్లో సౌరవ్ గంగూలీ ఆ గెలుపు నిరీక్షణకి కెప్టెన్‌గా తెరదించాడు. ఆ తర్వాత 2009లో మహేంద్రసింగ్ ధోనీ, 2011లో సురేశ్ రైనా, 2017లో విరాట్ కోహ్లీ కెప్టెన్లుగా అక్కడ సిరీస్ విజయాల్ని అందుకున్నారు. తాజాగా శిఖర్ ధావన్‌ కూడా ఆ లిస్ట్‌లో చేరాడు.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.