యాప్నగరం

డబుల్ సెంచరీ ముంగిట ధావన్ ఔట్..!

ఇప్పటి వరకు శిఖర్ ధావన్ 2013లో ఆస్ట్రేలియాపై చేసిన 187 పరుగులే టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా

TNN 26 Jul 2017, 2:59 pm
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ డబుల్ సెంచరీ ముంగిట ఔటైపోయాడు. మ్యాచ్ తొలి సెషన్ నుంచి లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ ఎడాపెడా బౌండరీలు బాదిన ధావన్ (190: 168 బంతుల్లో 31x4) కెరీర్‌లో బెస్ట్ స్కోర్ అందుకున్న కొద్దిసేపటికే పెవిలియన్ చేరిపోయాడు. ఇన్నింగ్స్ 55 ఓవర్ బౌలింగ్ చేసిన ప్రదీప్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి మిడాఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మాథ్యూస్ తలమీదుగా బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించాడు.
Samayam Telugu shikhar dhawan falls for 190 before tea
డబుల్ సెంచరీ ముంగిట ధావన్ ఔట్..!


కానీ.. ప్రదీప్ ఆఫ్ స్టంప్‌కి కొంచెం దూరంగా బంతి విసరడంతో.. షాట్‌ని అశించిన విధంగా ధావన్ కనెక్ట్ చేయలేకపోయడంతో బంతి నేరుగా మాథ్యూస్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో రెండో వికెట్‌కి అభేద్యమైన 253 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇప్పటి వరకు శిఖర్ ధావన్ 2013లో ఆస్ట్రేలియాపై చేసిన 187 పరుగులే టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉండేది. తాజాగా ఆ స్కోరుని అధిగమించిన కాసేపటికే ధావన్ ఔటవడం విచారకరం. టీ విరామ సమయానికి భారత్ 55 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 282 పరుగులతో నిలిచింది. క్రీజులో చతేశ్వర్ పుజారా (75 నాటౌట్: 135 బంతుల్లో 5x4), విరాట్ కోహ్లి (1 నాటౌట్) ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.