యాప్నగరం

భారత వన్డే జట్టులో వేటుపై పెదవి విప్పిన శిఖర్ ధావన్.. నా కంటే వేరొకరు బాగా ఆడితే?

ODI World Cup 2023 లో ఆడాలని శిఖర్ ధావన్ ఆశిస్తున్నాడు. కానీ శుభమన్ గిల్ ఇటీవల వరుస సెంచరీలతో వన్డే జట్టులో పాగా వేసేశాడు. అతను చివరిగా ఆడిన ఏడు మ్యాచ్‌లకిగానూ నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. దాంతో గబ్బర్ ఇప్పట్లో వన్డే టీమ్‌లోకి పునరాగమనం చేయడం చాాలా కష్టం. అయితే.. ఐపీఎల్ 2023లో సత్తాచాటగలిగితే? అతనికి డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ దిశగానే గబ్బర్ అడుగులు వేస్తున్నాడు.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 15 Feb 2023, 6:17 pm

ప్రధానాంశాలు:

  • రెండు నెలలుగా భారత్ జట్టుకి శిఖర్ ధావన్ దూరం
  • టీమ్‌లో పాగా వేసేసిన యంగ్ ఓపెనర్ గిల్
  • ఈ ఏడాది భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్
  • రీఎంట్రీపై ధీమా వ్యక్తం చేసిన గబ్బర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Shubman Gill, Shikhar Dhawan
శుభమన్ గిల్, శిఖర్ ధావన్
భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan ) గత రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉంటున్నాడు. ఈ ఏడాది భారత్ వేదికగానే వన్డే ప్రపంచకప్ -2023 టోర్నీ జరగనుండగా.. పరిస్థితుల్ని చూస్తుంటే గబ్బర్ ఈ మెగా టోర్నీలో ఆడటం సందేహంగానే కనిపిస్తోంది. శిఖర్ ధావన్ స్థానంలో యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్‌కి టీమిండియా మేనేజ్‌మెంట్ వరుస అవకాశాలిస్తోంది. ఆస్ట్రేలియాతో మార్చిలో మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. ఈ సిరీస్‌కి కూడా గిల్ ఓపెనర్‌గా ఎంపికవడం లాంఛనమే. దానికి కారణం శుభమన్ గిల్ (Shubman Gill) చివరి ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 4 సెంచరీలు బాదేయగా.. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది.
నవంబరులో భారత్ జట్టుని కెప్టెన్‌గా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో నడిపించిన శిఖర్ ధావన్.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో డిసెంబరులో జరిగిన సిరీస్‌లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కానీ.. ఆ తర్వాత మళ్లీ సెలెక్టర్లు గబ్బర్‌ని పట్టించుకోవడం లేదు. గత ఐదేళ్ల నుంచి టెస్టులకి దూరంగా ఉంటున్న శిఖర్ ధావన్.. 2021 నుంచి టీ20 జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే.. వన్డే టీమ్‌లో మాత్రం గత ఏడాది చివరి వరకూ శిఖర్ ధావన్‌కి అవకాశం లభించింది. కానీ.. గిల్ రాకతో అతడ్ని సెలెక్టర్లు పక్కన పెడుతున్నారు.

వన్డే జట్టులో వేటుపై శిఖర్ ధావన్ మాట్లాడుతూ ‘‘జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. సమయం, అనుభవం చాలా విషయాల్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పుతుంది. నేను అత్యుత్తమంగా ఆడాను. కానీ.. వేరొకరు నా కంటే మెరుగ్గా ఆడారు. అందుకే నేను ఇక్కడ ఉన్నాను.. అతను అక్కడున్నాడు. అయితే.. ఎప్పటికైనా మళ్లీ జట్టులో చోటు దక్కించుకుంటాను’’ అని ధీమా వ్యక్తం చేశాడు.

Read Latest Sports News, Cricket News, Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.