ఇంగ్లాండ్తో టీ20లు.. హిట్టర్స్పై భారత్ దృష్టి
భారత జట్టుకి ఇంగ్లాండ్ పర్యటన రూపంలో రేపటి నుంచి కఠిన సవాల్ ఎదురుకానుంది. ఇటీవల ఐర్లాండ్తో ముగిసిన రెండు టీ20 సిరీస్ని 2-0తో
Samayam Telugu 2 Jul 2018, 12:58 pm
భారత జట్టుకి ఇంగ్లాండ్ పర్యటన రూపంలో రేపటి నుంచి కఠిన సవాల్ ఎదురుకానుంది. ఇటీవల ఐర్లాండ్తో ముగిసిన రెండు టీ20 సిరీస్ని 2-0తో చేజిక్కించుకున్న టీమిండియా.. మంగళవారం రాత్రి 10 గంటలకి ఇంగ్లాండ్తో తొలి టీ20 మ్యాచ్ని ఆడనుంది. ఇంగ్లాండ్ పర్యటనలో సుదీర్ఘకాలంగా భారత జట్టుకి పేలవ రికార్డు ఉన్న నేపథ్యంలో.. ఈసారి సత్తాచాటాలని కోహ్లిసేన ఉవ్విళ్లూరుతుండగా.. గతవారం ఆస్ట్రేలియాతో ముగిసిన సిరీస్లో రికార్డుల మోత మోగించిన ఇంగ్లాండ్ ఆదే జోరుని కొనసాగించాలని ఆశిస్తోంది.
భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లోనూ ఆటగాళ్ల బలహీనతలపై ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత కొన్ని సిరీస్లుగా షార్ట్ పిచ్ బంతుల్ని ఆడటంలో విఫలమవుతున్న శిఖర్ ధావన్కి ఎక్కువగా ఆ బంతుల్ని విసురుతూ ప్రాక్టీస్ చేయించిన కోచ్.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య బౌలింగ్లో కూడా మార్పులు సూచించాడు. ఇందులో భాగంగానే ఓపెనర్ రోహిత్ శర్మకి నెట్స్లో ఆఫ్ కటర్స్ని విసురుతూ హార్దిక్ కనిపించాడు. ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్ జేసన్ రాయ్, జోస్ బట్లర్, జానీ బారిస్టో లాంటి హిట్టర్స్ ఉన్న నేపథ్యంలో.. వారిని ఇబ్బందిపెట్టేలా బౌలింగ్ విభాగంతో కలిసి రవిశాస్త్రి ఎక్కువగా నెట్స్లో కనిపిస్తున్నారు.
భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లోనూ ఆటగాళ్ల బలహీనతలపై ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఎక్కువగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత కొన్ని సిరీస్లుగా షార్ట్ పిచ్ బంతుల్ని ఆడటంలో విఫలమవుతున్న శిఖర్ ధావన్కి ఎక్కువగా ఆ బంతుల్ని విసురుతూ ప్రాక్టీస్ చేయించిన కోచ్.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య బౌలింగ్లో కూడా మార్పులు సూచించాడు. ఇందులో భాగంగానే ఓపెనర్ రోహిత్ శర్మకి నెట్స్లో ఆఫ్ కటర్స్ని విసురుతూ హార్దిక్ కనిపించాడు. ఇంగ్లాండ్ జట్టులో ఓపెనర్ జేసన్ రాయ్, జోస్ బట్లర్, జానీ బారిస్టో లాంటి హిట్టర్స్ ఉన్న నేపథ్యంలో.. వారిని ఇబ్బందిపెట్టేలా బౌలింగ్ విభాగంతో కలిసి రవిశాస్త్రి ఎక్కువగా నెట్స్లో కనిపిస్తున్నారు.