యాప్నగరం

రోహిత్, ధావన్‌ల ఆటే కీలకం: బ్రెట్‌లీ

ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లను రోహిత్ శర్మ సమర్థంగా ఎదుర్కోలేడు అనే వాదనతో నేను ఏకీభవించను. అయితే.. ప్రత్యర్థి జట్లు కచ్చితంగా అతడిని ఆ బలహీనతతోనే టార్గెట్ చేస్తాయి.

Samayam Telugu 6 Sep 2018, 7:29 pm
ఆసియా కప్‌లో భారత్ జట్టు గెలవాలంటే ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌‌ అత్యుత్తమంగా ఆడాలని ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీ సూచించాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 15 నుంచి ఆసియా కప్ ప్రారంభంకానుండగా.. 18న క్వాలిఫయర్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా 19న పాకిస్థాన్‌తో ఢీకొననుంది. కెప్టెన్ కోహ్లీకి ఈ టోర్నీ నుంచి సెలక్టర్లు విశ్రాంతినిచ్చి నేపథ్యంలో.. జట్టు గెలుపు బాధ్యతలను ఓపెనర్లు తీసుకోవాలని సూచించాడు. ముఖ్యంగా కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ బాధ్యత మరింత పెరిగిందని చెప్పుకొచ్చాడు.
Samayam Telugu DNjgOABXcAE9_Yk


‘ఆసియా కప్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ ఆట భారత్‌కి చాలా కీలకం. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో.. అందరి దృష్టి రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్)పై ఉంటుంది. కాబట్టి.. వీరిద్దరూ బాధ్యతగా ఆడి జట్టుని ముందుండి నడిపించాలి. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లను రోహిత్ శర్మ సమర్థంగా ఎదుర్కోలేడు అనే వాదనతో నేను ఏకీభవించను. అయితే.. ప్రత్యర్థి జట్లు కచ్చితంగా అతడిని ఆ బలహీనతతోనే టార్గెట్ చేస్తాయి. కానీ.. యూఏఈ పిచ్‌లు రోహిత్ శర్మ ఆటకి చక్కగా సరిపోతాయి. కాబట్టి.. అతను మెరుగైన ప్రదర్శన చేయొచ్చు’ అని బ్రెట్‌లీ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.