యాప్నగరం

Shikhar Dhawanపై కోప్పడిన హార్దిక్ పాండ్య..!

నాలుగు నెలల తర్వాత మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్య.. ఈరోజు 10 ఓవర్లు బౌలింగ్ చేసి 2/45తో ఫర్వాలేదనిపించాడు. కానీ..

Samayam Telugu 28 Jan 2019, 12:45 pm
న్యూజిలాండ్‌తో మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా సోమవారం జరుగుతున్న మూడో వన్డేలో భారత యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సహనం కోల్పోయాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేసిన అతను.. ఈరోజు 10 ఓవర్లు బౌలింగ్ చేసి 2/45తో ఫర్వాలేదనిపించాడు. కానీ.. ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ వేస్తున్న సమయంలో శిఖర్ ధావన్ సరిగా బంతిని త్రో చేయకపోవడంతో అతనిపై అసహనం వ్యక్తం చేశాడు.
Samayam Telugu 22


ఆ ఓవర్‌లో రెండో బంతిని బౌన్సర్ రూపంలో హార్దిక్ పాండ్య సంధించగా.. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ మిడ్ వికెట్ దిశగా హిట్ చేశాడు. కానీ.. అక్కడ ఎవరూ ఫీల్డర్లు లేకపోవడంతో సింగిల్ పూర్తి చేసుకున్న టేలర్.. రెండో పరుగు కోసం ప్రయత్నించగా.. స్వ్కేర్‌ లెగ్ నుంచి అప్పటికే వేగంగా పరుగెత్తుకొచ్చిన శిఖర్ ధావన్ బంతిని అందుకుని తత్తరపాటులో అటు బౌలర్‌కి కాకుండా.. ఇటు వికెట్ కీపర్‌కి కాకుండా మధ్యలో విసిరాడు. ఇదే అదునుగా భావించిన న్యూజిలాండ్ రెండో పరుగుని కూడా పూర్తి చేసుకుంది. తన బౌలింగ్‌లో అదనంగా మరో పరుగు రావడంతో సహనం కోల్పోయిన హార్దిక్.. ధావన్‌ తీరుపై మండిపడ్డాడు.

మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు రాస్‌ టేలర్ (93: 106 బంతుల్లో 9x4), టామ్ లాథమ్ (51: 64 బంతుల్లో 1x4, 1x6) అర్ధశతకాలు బాదినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో 49 ఓవర్లలో 243 పరుగులకే కుప్పకూలిపోయింది. భారత్ బౌలర్లలో హార్దిక్‌తో పాటు మహ్మద్ షమీ (3/43),భువనేశ్వర్ కుమార్ (2/46), హార్దిక్ పాండ్య (2/45) చాహల్ (2/51) సమష్టిగా రాణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.