యాప్నగరం

Shoaib Akhtar: పాక్ కెప్టెన్ ‘జాతి వివక్ష’ వ్యాఖ్యలపై అక్తర్ ఫైర్..!

సర్ఫరాజ్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కావు. వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగుతున్న సమయంలో అతను ఆ మాటలు అని ఉండొచ్చు. కానీ..?

Samayam Telugu 24 Jan 2019, 12:34 pm
దక్షిణాఫ్రికా క్రికెటర్ పెహ్లూక్వాయోపై మైదానంలో పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. డర్బన్ వేదికగా గత మంగళవారం ముగిసిన రెండో వన్డేలో పెహ్లూక్వాయో బ్యాటింగ్ చేస్తుండగా.. వికెట్ల వెనుక నుంచి సర్ఫరాజ్ తన నోటికి పని చెప్పాడు. ఈ క్రమంలో.. హద్దులు దాటిన సర్ఫరాజ్ ‘ఏయ్ నల్లోడా.. మీ అమ్మ ఇప్పుడెక్కడ కూర్చుంది..? నీ గురించి ఆమెను ఏమి ప్రార్థించమన్నావ్..?’ అని ఉర్దూలో స్లెడ్జింగ్ చేశాడు. ఆ మాటలు స్టంప్ మైక్‌‌లో స్పష్టంగా రికార్డ్ అవడంతో.. సర్ఫరాజ్‌పై చర్యలు తీసుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సిద్ధమవుతోంది.
Samayam Telugu 2000


పెహ్లూక్వాయోపై తాను అన్న మాటలు వెలుగులోకి రావడంతో సర్ఫరాజ్ అహ్మద్ ఇప్పటికే ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ.. అతనిపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. తాజాగా పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. పాక్ కెప్టెన్ తీరుపై మండిపడ్డాడు. ‘సర్ఫరాజ్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కావు. వాటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగుతున్న సమయంలో అతను ఆ మాటలు అని ఉండొచ్చు. అయినప్పటికీ.. అలా మాట్లాడటం తప్పే. కాబట్టి.. సర్ఫరాజ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలి’ అని అక్తర్ డిమాండ్ చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.