యాప్నగరం

​షోయబ్ మాలిక్‌ని కలిసిన సానియా మీర్జా.. ఏడు నెలల తర్వాత

షోయబ్ మాలిక్, సానియా మీర్జా దంపతులు ఏడు నెలల తర్వాత మళ్లీ కలిశారు. లాక్‌‌డౌన్ ముందు హైదరాబాద్‌లో సానియా ఉండగా.. పాక్‌లో షోయబ్ మాలిక్ ఉండిపోయాడు. ఆ తర్వాత కూడా..?

Samayam Telugu 10 Sep 2020, 6:51 pm
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌ని దాదాపు ఏడు నెలల తర్వాత అతని భార్య, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కలిసింది. ఇంగ్లాండ్ టూర్‌ని ముగించుకుని ఇటీవల దుబాయ్‌కి షోయబ్ మాలిక్‌రాగా.. తాజాగా హైదరాబాద్ నుంచి తన కొడుకు ఇజాన్‌తో కలిసి అక్కడికి వెళ్లిన సానియా మీర్జా అతడ్ని కలిసింది. ఇజాన్‌తో దుబాయ్‌లో తాను ఆడుకుంటున్న వీడియోని సోషల్ మీడియాలో మాలిక్ షేర్ చేశాడు.
Samayam Telugu Shoaib Malik, Sania Mirza
Shoaib Malik, Sania Mirza



కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి‌లో అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించగా.. హైదరాబాద్‌లో సానియా మీర్జా, పాకిస్థాన్‌లో షోయబ్ మాలిక్ ఉండిపోయారు. ఆ తర్వాత జులైలో సానియా మీర్జాని కలిసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నుంచి కూడా షోయబ్ మాలిక్ అనుమతి తెచ్చుకున్నాడు. కానీ.. పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి పర్మీషన్ లభించకపోవడంతో పాక్ నుంచి నేరుగా ఇంగ్లాండ్‌కి మాలిక్‌కి వెళ్లిపోయాడు.


దుబాయ్‌లో కొన్ని రోజులు ఉన్న తర్వాత పాకిస్థాక్‌కి మాలిక్, సానియా మీర్జా వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ టూర్‌లో ఆశించిన మేర రాణించలేకపోయిన షోయబ్ మాలిక్ ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.