ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి వికెట్ పడగొట్టాలని తాను ఆశిస్తున్నట్లు సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సిరాజ్ వెల్లడించాడు. సోమవారం జరిగిన ఐపీఎల్ వేలంలో హైదరాబాద్ ఫ్రాంఛైజీ సిరాజ్ను రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది. హైదరాబాద్లో ఆటో డ్రైవర్ కొడుకైన సిరాజ్.. స్వశక్తితో బౌలర్గా ఎదిగాడు. ఇటీవల రంజీల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచి అందర్నీ ఆకర్షించాడు. ఈ ప్రతిభతోనే ఐపీఎల్లో అతని పంట పండింది. కేవలం రూ.20 లక్షల ప్రాథమిక ధరతో వేలంలోకి వచ్చిన అతని కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. హైదరాబాద్ మెంటార్ లక్ష్మణ్ సూచనతో సన్రైజర్స్ ఫ్రాంఛైజీ చివరి వరకూ పోరాడి సిరాజ్ను భారీ ధరకు చేజిక్కించుకుంది.
వేలంలో తను భారీ ధరకు అమ్ముడుపోవడంతో ఆనందం వ్యక్తం చేసిన సిరాజ్.. తొలుత తన కుటుంబం కోసం హైదరాబాద్లో మంచి ఇల్లు కొంటానన్నాడు. ప్రస్తుతం భారత్ జట్టులో చోటు కోసం తాను ఆశిస్తున్నానని అంతకంటే ముందు ఐపీఎల్లో సత్తా చాటి నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 5న ఆరంభంకానున్న ఐపీఎల్ పదో సీజన్లో తొలి మ్యాచ్ బెంగళూరు, హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్లో ఆడే అవకాశం కల్పిస్తే మొదట విరాట్ కోహ్లి వికెట్ పడగొట్టేందుకు ప్రయత్నిస్తానని సిరాజ్ చెప్పడం విశేషం.
వేలంలో తను భారీ ధరకు అమ్ముడుపోవడంతో ఆనందం వ్యక్తం చేసిన సిరాజ్.. తొలుత తన కుటుంబం కోసం హైదరాబాద్లో మంచి ఇల్లు కొంటానన్నాడు. ప్రస్తుతం భారత్ జట్టులో చోటు కోసం తాను ఆశిస్తున్నానని అంతకంటే ముందు ఐపీఎల్లో సత్తా చాటి నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 5న ఆరంభంకానున్న ఐపీఎల్ పదో సీజన్లో తొలి మ్యాచ్ బెంగళూరు, హైదరాబాద్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్లో ఆడే అవకాశం కల్పిస్తే మొదట విరాట్ కోహ్లి వికెట్ పడగొట్టేందుకు ప్రయత్నిస్తానని సిరాజ్ చెప్పడం విశేషం.