యాప్నగరం

COVID-19: ఇంగ్లాండ్ టీమ్‌లో కరోనా కలకలం.. ఆల్‌రౌండర్‌కి పాజిటివ్

శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడేందుకు అక్కడికి వెళ్లిన ఇంగ్లాండ్ టీమ్‌కి ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కరోనా వైరస్ బారినపడ్డాడు. అతనితో ఫాస్ట్ బౌలర్ క్లోజ్‌గా ఉండటంతో..?

Samayam Telugu 5 Jan 2021, 7:54 am
శ్రీలంకతో టెస్టు సిరీస్ ముంగిట ఇంగ్లాండ్ టీమ్‌లో కరోనా వైరస్ కలకలం రేగింది. గాలే వేదికగా జనవరి 14 నుంచి వరుసగా రెండు టెస్టుల సిరీస్‌ని ఆడేందుకు శ్రీలంకకి వెళ్లిన ఇంగ్లాండ్ టీమ్‌కి తాజాగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా.. ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి పాజిటివ్‌గా తేలింది. దాంతో.. ప్రయాణంలో అతనికి క్లోజ్‌గా ఉన్న ఫాస్ట్ బౌలర్ క్రిస్‌వోక్స్‌‌‌ని కూడా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించారు.
Samayam Telugu Moeen Ali (Image Credit: Twitter)


టెస్టు సిరీస్‌లో ఆడేందుకు శ్రీలంకలోని హంబన్‌తోట విమానాశ్రయానికి ఇంగ్లాండ్ టీమ్ తాజాగా చేరుకోగా.. అక్కడి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొయిన్ అలీకి పాజిటివ్ రావడంతో అతడ్ని వెంటనే 10 రోజుల క్వారంటైన్‌కి తరలించారు. అలానే అతనితో క్లోజ్‌గా ఉన్న క్రిస్‌వోక్స్‌ని మరోసారి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించే వరకూ సెల్ఫ్ ఐసోలేషన్‌‌లో ఉండాలని ఆదేశించారు.

గాలె వేదికగానే శ్రీలంక, ఇంగ్లాండ్ జట్లు రెండు టెస్టులనూ ఆడనుండగా.. జనవరి 26తో ఈ సిరీస్ ముగియనుంది. ఆ వెంటనే భారత్‌కి రానున్న ఇంగ్లాండ్ టీమ్.. ఫిబ్రవరి 5 నుంచి నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ని టీమిండియాతో ఆడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.